న్యూఢిల్లీ, ఆగస్టు 31 (ఇయ్యాల తెలంగాణ) : పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇంత అత్యవసరంగా పార్లిమెంట్ సమావేశాలు నిర్వహించడం పట్ల సర్వత్రా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే పార్లిమెంట్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించడానికి ఏదైనా బిల్లు పార్లిమెంట్ లో పెట్ట బోతున్నారా అంటూ సోషల్ మీడియాలో రక రకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక పార్లమెంట్ సమావేశం లోనే అసలు విషయాలు ఏంటనేది తెలుస్తోంది.
- Homepage
- National News
- September 18 నుంచి 22 వరకు Parliament ప్రత్యేక సమావేశాలు
September 18 నుంచి 22 వరకు Parliament ప్రత్యేక సమావేశాలు
Leave a Comment