కరీంనగర్ ఆగష్టు 5, (ఇయ్యాల తెలంగాణ ): గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఎదైనా సమస్య వస్తే గవర్నరే బాధ్యత వహిస్తారు. అర్టీసి ఆస్తులు అమ్మె ప్రయత్నం జరుగుతుందని ఎంపి బండి సంజయ్ అన్నారు. పంట నష్టం గురించి మాట్లాడుకోవద్దనే అర్టీసి విలినం అంశం లేవనెత్తారు.ముఖ్యమంత్రి ది రాక్షస బుద్ది. గవర్నర్ ని బదనం చేసే పనిలో ఉన్నాడు. ఆర్టీసి కార్మికులకి న్యాయం చేసే అంశాన్ని గవర్నర్ పరిశీలిస్తున్నారు. ఆర్టీసి కార్మికులు దయచేసి అలోచించాలి. రెండు రోజులలో అర్టీటి విలినం చేస్తే రేపు న్యాయపరమైన ఇబ్బందులు వస్తే గవర్నర్ బాధ్యతలు వహించాలి. అర్టీసి ఆస్తులని లీజు పేరా దోచుకునే కుట్ర జరుగుతోంది. ఆర్టీసి విలీనం గురించి చర్చ పెట్టాలని అయన అన్నారు.
