ముంబై , ఏప్రిల్ 4 (ఇయ్యాల తెలంగాణ) : భారత కరెన్సీ మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఖీఃఎ తీసుకున్న రెండు దశల కఠిన చర్యలు మార్కెట్ను ఒక్కసారిగా కుదిపేశాయి. ఈ చర్యల ప్రభావంతో గురువారం రూపాయి విలువ 1.8 శాతం పెరిగి 93.10 వద్ద ముగిసింది. ఇది దాదాపు 13 ఏళ్లలో అత్యంత భారీ ఒక్కరోజు లాభంగా నిలవడంతో పాటు, రూపాయి`డాలర్ సమతుల్యతను తాత్కాలికంగా మార్చింది. గత కొన్ని నెలలుగా రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చింది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, గ్లోబల్ వాణిజ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి కారణాల వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో రూపాయి దాదాపు 10 శాతం వరకు పడిపోయింది.మార్చి నెలలోనే అదనంగా 4 శాతం క్షీణించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.

ఈ నేపథ్యంలో ఆర్బిఐ సాధారణంగా అనుసరించే డాలర్ విక్రయాలు, వడ్డీ రేట్ల మార్పులు వంటి చర్యలు సరిపోకపోవడంతో, మరింత కఠిన నిర్ణయాలకు దిగింది. ప్రత్యేకంగా బ్యాంకులు ఆన్షోర్, ఆఫ్షోర్ మార్కెట్ల మధ్య ధరల వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ద్వారా లాభాలు ఆర్జిస్తున్నాయని ఆర్బిఐ గుర్తించింది. ఈ ప్రక్రియలో డాలర్కు కత్రిమ డిమాండ్ పెరగడంతో రూపాయి మరింత బలహీనపడుతోంది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, బ్యాంకుల నికర ఓపెన్ పొజిషన్ను కేవలం 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేస్తూ ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది.ఈ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున డాలర్ పొజిషన్లను తగ్గించాల్సి వచ్చిన బ్యాంకులు, మార్కెట్లో డాలర్లను అమ్మడం ప్రారంభించాయి. దాంతో సరఫరా పెరిగి రూపాయి బలపడింది. అయితే ఈ చర్యలతో బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ సుమారు 4 శాతం పడిపోవడం మార్కెట్లోని ఆందోళనను ప్రతిబింబించింది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ మార్పుల వల్ల బ్యాంకులకు వేల కోట్ల రూపాయల నష్టం సంభవించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఆర్బిఐ చర్యలు కేవలం తాత్కాలిక జోక్యం కాకుండా, కరెన్సీ మార్కెట్లో నియంత్రణను బలోపేతం చేసే దిశగా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలుగా భావించబడుతున్నాయి. భవిష్యత్తులో గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, మూలధన ప్రవాహాలు రూపాయి దిశను నిర్ణయించనున్నాయి
