భరించేది ఎలా ?

హైదరాబాద్, జూన్ 18, (ఇయ్యాల తెలంగాణ) : ఇంగ్లీషు విూడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. ఖర్చు ఎంతైనా పర్లేదు? తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని ఆరాటపడుతున్నారు. ఎన్ని కష్టాలు భరించైనా సరే యాజమాన్యాలు నిర్ణయించిన ఫీజులను చెల్లిస్తున్నారు.ఇక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సంగతి చూస్తే నిర్ణయించిన ఫీజు కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకునే పరిస్థితి ఉండదు. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఫీజులు పెంచుతూ రకరకాల కారణాలు చెబుతున్నారు. ఫీజులు మాత్రమే కాకుండా పుస్తకాలతో పాటు స్టేషనరీ అంటూ మరో రూపంలో కూడా దండుకునే పనిలో ఉంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు, నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ వీరి దూకుడుకు కల్లెం వేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. బిల్డింగ్ నిర్వహణ నుంచి టీచర్ల జీతాల వరకు ఏ విషయం తీసుకున్నా లోపాల పుట్ట బయటపడే పరిస్థితులు ఉన్నాయి.హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఇరుకైన భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. 90 శాతం స్కూళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇరుకైన గదుల్లోనే తరగతులు జరుగుతున్నాయి. అందులోనూ సెక్షన్ వారీగా విభజిస్తూ?భవనమంతా పిల్లలతో కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం. వాటితోనే మానసికోల్లాసం కలుగుతుందని, దేహధారుఢ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ పెడచెవిన పెట్టేస్తున్నారు. ఎక్కువ సమయం స్కూల్ లోనే గడిపేస్తూ? పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎంతసేపు చదువే ముఖ్యం అన్నట్లు పాఠశాలలు వ్యవహరిస్తున్న తీరు ఉంటోంది. క్రీడా వసతులు లేక పలు రకాల ఆటలపై మక్కువ ఉండే విద్యార్థులు కూడా వెనకడుగు వేసే పరిస్థితులు ఉంటున్నాయి.ఓవైపు యథేచ్చగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు కనీస వసతలు కల్పించడంలో విఫలమవుతున్నాయి. ఐదో తరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు కొన్ని రకాల ప్రయోగత్మక (సైన్స్) పాఠాలు ఉంటాయి. వీటికి థియరీ క్లాసులు మాత్రమే చెబితే సరిపోదు. తప్పనిసరిగా ల్యాబ్ పాఠాలు ఉండాలి.అందులో మెరుగైన బోధన పరికరాలు ఉండేలా చూసుకోవాలి. దీనికంటూ ఓ ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. కానీ చాలా ప్రైవేటు బడుల్లో ఇలాంటి వాటికి చోటు ఉండటం లేదు. ఈ విషయంలో ప్రభుత్వ బడులు ముందంజలో ఉంటున్నాయి.
ప్రతి బడిలోనూ గ్రంథాలయం ఉండాలి. చాలా బడుల్లో నామమాత్రంగా సింగిల్ రూమ్ లోనే ఏర్పాటు చేస్తూ? లెక్కలు చూపించుకుంటున్నారు. కొన్నింటిలో వాటి జాడే ఉండటం లేదు. ప్రైవేటు బడుల్లో అతిపెద్ద సమస్య శుభ్రమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవటం! వందలాది మంది విద్యార్థులు ఒకే భవనంలో ఉంటున్నప్పటికీ వారి సంఖ్యకు అనుగుణంగా వీటి నిర్మాణాలు ఉండటం లేదు. ఫ్లోర్ల వారీగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇవి ఏ మాత్రం సరిపోలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాలికలు చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నారుచాలా ప్రైవేటు పాఠశాలలకు శాశ్వత భవనాలు ఉండటం లేదు. అద్దెకు భవనాలు తీసుకుంటూ నడిపిస్తున్నారు. గాలి, వెలుతురు కూడా సరిగా లేని బడులు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయి. కొన్ని బడులకు ఫైర్ సెఫ్టీ సర్టిఫికెట్ లు కూడా ఉండటం లేదు.ప్రైవేట్/ కార్పొరేట్ బడుల్లో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా డొనేషన్ పేరుతో రాబడుతున్నారు. దీనికి సంబంధించి ఏ ఒక్క కాగితం కూడా ఉండదు. కేవలం స్కూల్ ఫీజుకు మాత్రం రశీదులు ఇస్తున్నారు.
చట్ట ప్రకారం? డొనేషన్ లు తీసుకోవటం నిషేధం. కానీ దాదాపు అన్ని ప్రైవేటు బడులు? డొనేషన్ల పేరుతో కోట్ల రూపాయలను వెనక్కి వేసుకుంటున్నాయి.ఓవైపు డొనేషన్లు.. మరోవైపు ఫీజులు వసూలు చేసుకుంటూనే అందులో పని చేసే టీచర్లకు మాత్రం అంతంతే అన్నట్లు జీతాలను చెల్లిస్తున్నారు. బీఈడీ, పీజీలు చేసి నైపుణ్యం ఉన్న టీచర్లకు కూడా తక్కువ జీతాలే ఇస్తున్నారు. కొన్ని ప్రీ ప్రైమరీ స్కూళ్లలో 5 నుంచి 15 వేల జీతంతోనే పలువురు టీచర్లు పని చేస్తున్నారు. ప్రైమరీ, హై స్కూల్ కు భోదించే టీచర్లకు రూ. 15 నుంచి రూ. 30 వేల లోపే చెల్లిస్తున్నారు. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లకు మాత్రం? రూ. 30 వేలకు జీతం ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి.చాలా బడుల యాజమాన్యాలు సకాలంలోనే విద్యార్థులు నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ టీచర్లకు మాత్రం సకాలంలో ఇవ్వటం లేదు. నెల పూర్తి అయిన వారం నుంచి పది రోజులలోపు చెల్లిస్తున్నారు. ప్రైవేటు బడుల్లో పని చేసే చాలా మంది టీచర్లకు పీఎఫ్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యం కూడా ఉండటం లేదు. కనీసం వీరి సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఇక వేసవి సెలవులు వస్తే పూర్తిగా జీతాలు ఉండవు. ఈ టైంలో టీచర్ల చెప్పలేనన్నీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తల్లిదండ్రులను ఆకర్షించేందుకు రకరకాల పేర్లతో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్ బ్రాంచ్ ఒక చోట ఉంటే?ఆ క్యాంపస్ కు అనుగుణంగా మరికొన్ని బడులు ఉంటున్నాయి. వీటిని ఒలంపియాడ్, టెక్నో, డిజిటల్, ఇంటర్నేషనల్, ఫౌండేషన్ వంటి రకరకాల పేర్లతో నడిపిస్తున్నారు.
ఒక్కో క్యాంపస్ లో ఒక్కో విధంగా ఫీజులను వసూలు చేస్తున్నారు. చట్టప్రకారం? ఇలాంటి తోక పేర్లతో పాఠశాలలను నిర్వహించవద్దని ప్రభుత్వం పలుమార్లు ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ తమను ఆపేది ఎవరన్నట్టు? పలు ప్రైవేటు బడుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ముందుకెళ్తున్నాయి. పేరేంట్స్ కమిటీలు పేరుకే అన్న చందంగా మిగిలిపోతున్నాయి.ప్రైవేటు బడుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆశించిన మేర అమలు కావటం లేదు. ఫీజుల నియంత్రణ నుంచి బడుల్లో మౌలిక వసతులు, టీచర్ల నియాకం వరకు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం దశలోనే తనిఖీలు కాకుండా? నిరంతరం జరిపేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు బడులపై నిఘా వ్యవస్థ ఉండాలని? యథేచ్ఛగా ఫీజులు వసూలు చేసే బడులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రైవేటు బడుల్లో మౌలిక వసతుల కల్పనపై హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో ఉస్మానియా వర్శిటీ విద్యార్థి సంఘ నాయకుడు చటారి దశరథ్ మాట్లాడారు. ప్రైవేటు బడులు ఇష్టారాజ్యాంగా అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. డొనేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ. భారీ స్థాయిలో తీసుకుంటు న్నారని చెప్పారు. ప్రైవేటు బడుల ప్రాంగణంలో బుక్స్, స్టేషనరీ అమ్మవద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ చాలా బడులు ఈ తంతును కొనసాగిస్తున్నాయని తెలిపారు.’’హైదరాబాద్ నగరంలో ప్రైవేటు బడుల నిర్వహణ దారుణంగా ఉంటోంది. ఇరుకైన భవనాల్లో తరగతులు నిర్వహిస్తుం డటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస మౌలిక వసతులు కూడా కల్పించటం లేదు. టెట్ అర్హత సాధించిన వారినే టీచర్లుగా రిక్రూట్ చేసుకోవాలి. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ప్రైవేటు టీచర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి పే స్కేల్ అమలు చేయాలి. ఆరోగ్య బీమా వంటి సౌకర్యం కల్పించాలి. నిబంధనలు పాటించని స్కూళ్ల అనుమతులను రద్దు చేయాలి. ఫీజుల దోపిడిని నియంత్రిం చేందుకు సమగ్రమైన చట్టం తీసుకురావాలి’’ అని దశరథ్ అభిప్రాయపడ్డారు.