
హైదరాబాద్, జూన్ 24, (ఇయ్యాల తెలంగాణ) : మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉజ్జయినీ మహంకాళి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. జూలై 13 న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాలు జరగనున్నాయివ.