Hyderabad రియల్‌ Estate లో New రూల్‌

హైదరాబాద్‌, జనవరి 18, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌, పట్టణ అభివృద్ధిని ప్రభావితం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 అంతస్తులు దాటి నిర్మించే భవనాలకు టీడీఆర్‌ కొనుగోలు తప్పనిసరి చేసింది. చెరువులు, నదుల పరిరక్షణకు భూసేకరణను వేగవంతం చేసేందుకు ఆకర్షణీయమైన టీడీఆర్‌ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌ మహానగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని, పట్టణ అభివృద్ధిని ప్రభావితం చేసేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని చెరువులు, నదుల పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం భూసేకరణను వేగవంతం చేసేందుకు ‘టీడీఆర్‌’ నిబంధనలను సవరిస్తూ పురపాలక శాఖ జీవో నం.16ను విడుదల చేసింది. ఈ కొత్త ఉత్తర్వులు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకు విస్తరించిన తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలోని 300 డివిజన్లకు వర్తిస్తాయి.కొత్త నిబంధనల ప్రకారం.. నగరంలో 10 అంతస్తులు దాటి నిర్మించే ప్రతి భవనానికి టీడీఆర్‌ కొనుగోలు తప్పనిసరి చేశారు. 11వ అంతస్తు నుంచి పై అంతస్తుల వరకు మొత్తం నిర్మాణ విస్తీర్ణంలో 10 శాతానికి సమానమైన టీడీఆర్‌ సర్టిఫికెట్లను బిల్డర్లు సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కెట్‌లో నిల్వ ఉన్న టీడీఆర్‌ బాండ్లకు విపరీతమైన డిమాండ్‌ పెరుగుతుంది.

ఒకవేళ బిల్డర్లు తమ భూమిని ప్రభుత్వానికి ఉచితంగా అప్పగిస్తే.. వారికి సెట్‌బ్యాక్‌, భవన ఎత్తు నిబంధనలలో ప్రత్యేక సడలింపులు కూడా కల్పిస్తారు.చెరువులు, నదుల సవిూపంలోని పట్టా భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్యాకేజీని ప్రకటించింది. ఎఫ్‌టీఎల్‌  పూర్తిస్థాయి నీటి మట్టం పరిధిలోని భూములకు 200 శాతం టీడీఆర్‌, చెరువుల బఫర్‌ జోన్లలోని భూములకు 300 శాతం టీడీఆర్‌, బఫర్‌ వెలుపలి భూములు అభివృద్ధి కోసం సేకరిస్తే ఏకంగా 400 శాతం టీడీఆర్‌ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, భూసేకరణ విస్తీర్ణం ఒక ఎకరా కంటే ఎక్కువగా ఉంటే ఆ దరఖాస్తును ప్రభుత్వం నేరుగా పరిశీలిస్తుంది. మూసీ నది పరీవాహక ప్రాంతం, చెరువుల సుందరీకరణకు భూ యజమానుల నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది.గతంలో జారీ చేసిన సుమారు రూ. 10 వేల కోట్ల విలువైన టీడీఆర్‌ సర్టిఫికెట్లు మార్కెట్‌లో పేరుకుపోయి, వాటి విలువ పడిపోయింది. ఫలితంగా యజమానులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ నగదు పరిహారం కోరుతున్నారు. ఇప్పుడు పెద్ద భవనాల నిర్మాణానికి టీడీఆర్‌ తప్పనిసరి చేయడం వల్ల, బిల్డర్లు వీటిని కొనుగోలు చేయక తప్పదు. దీనివల్ల మార్కెట్‌లో టీడీఆర్‌ ధర పెరగడంతో పాటు, ప్రభుత్వంపై నగదు పరిహారం భారం తగ్గుతుంది. తద్వారా నిధుల కొరతతో ఆగిపోయిన రోడ్ల విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులు వేగవంతం కానున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....