Hyderabad పర్యటనకు వచ్చిన 10 దేశాల Media ప్రతినిధులు.

బుధవారం, జూన్ 26 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్న పర్యాటక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా కేంద్రాలను సందర్శించటానికి 21 మంది విదేశీ విూడియా ప్రతినిధులు  మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకున్నారు. వారికి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ప్రోటోకాల్‌ విభాగం అధికారులు స్వాగతం పలికారు. ఈస్ట్‌ ఆసియా, యూరేసియా, మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతనీలోని జార్జియా, ఆర్మేనియా, ఇరాన్‌, బెలారస్‌, తుర్క్మెనిస్తాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, మంగోలియా, కజకిస్థాన్‌ దేశాలకు చెందిన ప్రముఖ విూడియా ప్రతినిధులు 4 రోజుల పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా గోల్కొండ కోట, శిల్పారామం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, స్కై రూట్‌ ఎయిరో స్పేస్‌ సెంటర్‌, టి` హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ , రామోజీ ఫిల్మ్‌ సిటీ లను ఈ విూడియా బృందం సందర్శిస్తునీది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన విదేశీ డిప్లొమసి డివిజన్‌ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....