GST 2.0 Effect భారీగా తగ్గనున్న Cars, టూవీలర్‌

ముంబై, సెప్టెంబర్‌ 22, (ఇయ్యాల తెలంగాణ) : దేశవ్యాప్తంగా వాహన కొనుగోలుదారులకు శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీఎస్టీ 2.0 (వస్తు, సేవల పన్ను) సవరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త పన్ను విధానంతో కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గాయి. ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలన్నీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను నేరుగా కస్టమర్లకు బదిలీ చేస్తుండటంతో, వాహన రంగంలో అతిపెద్ద ధరల తగ్గింపు నమోదవుతోంది.సాధారణ ఎంట్రీ`లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌లపై సుమారు రూ. 40,000 నుంచి మొదలుకొని, ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలపై ఏకంగా రూ. 30 లక్షల వరకు ధరలు దిగిరావడం విశేషం. దీంతో కొత్త వాహనం కొనాలనుకునే వారికి ఇది సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

350సీసీ లోపు బైక్‌లపై భారీ ఊరట

భారతదేశంలో దాదాపు 98 శాతం మార్కెట్‌ వాటా ఉన్న 350సీసీ లోపు స్కూటర్లు, మోటార్‌సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంతో హీరో స్ప్లెండర్‌, హోండా యాక్టివా, బజాజ్‌ పల్సర్‌, టీవీఎస్‌ అపాచీ, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 వంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. హోండా తన యాక్టివాపై సుమారు రూ. 7,874, సీబీ350 బైక్‌పై రూ. 18,887 వరకు తగ్గింపును ప్రకటించింది.భారతీయ రోడ్లపై రాజసం ఒలకబోసే మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ తమ వినియోగదారులకు భారీ ప్రయోజనాలను అందించనున్నాయి.

ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ రెండు కంపెనీల కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

మహీంద్రా:

ఎక్స్‌యూవీ 3చీూ: పెట్రోల్‌ వేరియంట్‌పై రూ.1.40 లక్షలు, డీజిల్‌ వేరియంట్‌పై రూ.1.56 లక్షల వరకు ధర తగ్గనుంది.

స్కార్పియో ఎన్‌: ఎంతో ఆదరణ పొందిన ఈ మోడల్‌పై రూ.1.45 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

ఎక్స్‌యూవీ 700: టెక్నాలజీ, సేఫ్టీకి పెట్టింది పేరైన ఈ ఎస్‌యూవీ ధర రూ.1.43 లక్షలు తగ్గనుంది.

థార్‌: ఆఫ్‌`రోడిరగ్‌ ప్రియుల కలల వాహనం థార్‌ ధర రూ.1.35 లక్షల వరకు, థార్‌ రాక్స్‌ వేరియంట్‌ ధర రూ.1.33 లక్షల వరకు దిగిరానుంది.

బొలెరో నియో: రూ.1.27 లక్షలు, స్కార్పియో క్లాసిక్‌: రూ.1.01 లక్షల మేర చౌకగా లభించనున్నాయి.

టాటా మోటార్స్‌:

భద్రత, డిజైన్‌ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టాటా మోటార్స్‌ కూడా తన పోర్ట్‌ఫోలియోలోని దాదాపు అన్ని కార్లపై ధరలను తగ్గించనుంది.

నెక్సాన్‌: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్‌ ఎస్‌యూవీలలో ఒకటైన నెక్సాన్‌పై గరిష్టంగా రూ.1.55 లక్షల తగ్గింపు ఉండనుంది.

హారియర్‌, సఫారీ: ఈ ప్రీమియం ఎస్‌యూవీ ద్వయంపై వరుసగా రూ.1.40 లక్షలు, రూ.1.45 లక్షల వరకు ధరలు తగ్గనున్నాయి.

ఆల్ట్రోజ్‌: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేసిన ఆల్ట్రోజ్‌పై రూ.1.10 లక్షల ప్రయోజనం లభించనుంది.

పంచ్‌: రూ.85,000, టిగోర్‌: రూ.80,000, టియాగో: రూ.75,000 చొప్పున ధరలు తగ్గనున్నాయి.

త్వరలో మార్కెట్లోకి రానున్న కర్వ్‌ మోడల్‌పై కూడా రూ.65,000 వరకు తగ్గింపు ఉంటుందని అంచనా.

సామాన్యుడి కారు.. మారుతీ సుజుకీ:

భారతదేశంలో అత్యధిక మార్కెట్‌ వాటా కలిగిన మారుతీ సుజుకీ తన ఎంట్రీ`లెవల్‌ కార్ల నుంచి ప్రీమియం మోడళ్ల వరకు అన్నింటిపైనా ధరలను తగ్గించనుంది. దీంతో సొంత కారు ఉండాలనే సామాన్యుడి కల మరింత సులభంగా నెరవేరనుంది.

ఇన్విక్టో: మారుతీ లైనప్‌లోనే అత్యంత ఖరీదైన ఈ ఎంపీవీపై ఏకంగా రూ.2.25 లక్షల తగ్గింపు లభించనుంది.

జివ్నిూ: ఆఫ్‌`రోడిరగ్‌ సామర్థ్యమున్న ఈ చిన్న ఎస్‌యూవీ ధర రూ.1.14 లక్షలు తగ్గనుంది.

బ్రెజా: కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్లో టాప్‌ సెల్లర్‌ అయిన బ్రెజాపై రూ.78,000 వరకు ఆదా చేయవచ్చు.

ఫ్రాంక్స్‌: రూ.68,000, బాలెనో: రూ.60,000, డిజైర్‌: రూ.61,000, స్విఫ్ట్‌: రూ.58,000 చొప్పున ధరలు దిగిరానున్నాయి.

బడ్జెట్‌ కార్లయిన వ్యాగన్‌ఆర్‌: రూ.57,000, సెలెరియో: రూ.50,000, ఆల్టో కె10: రూ.40,000, ఎస్‌`ప్రెస్సో: రూ.38,000 వరకు చౌకగా లభించనున్నాయి.

ఎంపీవీలైన ఎర్టిగా: రూ.41,000, ఎక్స్‌ఎల్‌6: రూ.35,000 మేర ధరలు తగ్గనున్నాయి.

కొరియన్‌ హవా.. హ్యుందాయ్‌, కియా మోడళ్లపై భారీ ఆఫర్లు:

ఆధునిక డిజైన్‌, ఫీచర్లతో భారత మార్కెట్లో దూసుకుపోతున్న హ్యుందాయ్‌, కియా కంపెనీలు కూడా తమ వినియోగదారులకు జీఎస్టీ 2.0 ప్రయోజనాలను అందించనున్నాయి.

హ్యుందాయ్‌:

టూసాన్‌: ఈ ప్రీమియం ఎస్‌యూవీపై గరిష్టంగా రూ.2.4 లక్షల తగ్గింపు లభించనుంది.

వెన్యూ: రూ.1.23 లక్షలు, ఐ20: రూ.98,053 వరకు ధరలు తగ్గనున్నాయి. ఈ మోడళ్ల ఔ`ఒతినివ వేరియంట్లపై కూడా రూ. 1 లక్షకు పైగా తగ్గింపు ఉంది.

క్రెటా: మధ్యతరగతి ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను ఏలుతున్న క్రెటాపై రూ.72,145 తగ్గింపు ఉండనుంది.

ఎక్స్‌టర్‌: రూ.89,209, ఆరా: రూ.78,465, గ్రాండ్‌ ఐ10 నియోస్‌: రూ.73,808, అల్కాజార్‌: రూ.75,376 చొప్పున ధరలు తగ్గనున్నాయి.

కియా:

కార్నివాల్‌: కియా లైనప్‌లోనే అత్యంత ఖరీదైన ఈ లగ్జరీ ఎంపీవీపై ఊహించని విధంగా రూ.4.48 లక్షల భారీ తగ్గింపు లభించనుంది.

సిరోస్‌: రూ.1.86 లక్షలు, సోనెట్‌: రూ.1.64 లక్షల వరకు చౌకగా లభించనున్నాయి.

సెల్టోస్‌: రూ.75,372, కారెన్స్‌ క్లావిస్‌: రూ.78,674, కారెన్స్‌: రూ.48,513 మేర ధరలు తగ్గనున్నాయి.

జపనీస్‌ బ్రాండ్లపై నమ్మకమైన ఆఫర్లు:

నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరైన జపనీస్‌ కార్ల కంపెనీలు కూడా ఈ ధరల తగ్గింపుల పండుగలో పాలుపంచుకోనున్నాయి.

టయోటా:

ఫార్చ్యూనర్‌: ఎస్‌యూవీ సెగ్మెంట్‌ కింగ్‌గా పేరుగాంచిన ఫార్చ్యూనర్‌పై ఏకంగా రూ.3.49 లక్షల భారీ తగ్గింపు లభించనుంది. లెజెండర్‌ వేరియంట్‌పై కూడా రూ.3.34 లక్షల కోత ఉండనుంది.

వెల్‌ఫైర్‌: ఈ లగ్జరీ ఎంపీవీ ధర రూ.2.78 లక్షలు తగ్గనుంది.

ఇన్నోవా క్రిస్టా: రూ.1.80 లక్షలు, ఇన్నోవా హైక్రాస్‌: రూ.1.15 లక్షలు చౌకగా లభించనున్నాయి.

హిలక్స్‌: రూ.2.52 లక్షలు, క్యావ్రిూ: రూ.1.01 లక్షల వరకు ధరలు తగ్గనున్నాయి.

హోండా:

హోండా తన ప్రముఖ మోడళ్లపై రూ.95,500 వరకు ప్రయోజనాలను అందించనుంది. అమేజ్‌, ఎలివేట్‌, సిటీ వంటి కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

నిస్సాన్‌:

నిస్సాన్‌ మాగ్నైట్‌ కారు ధర రూ.1 లక్ష వరకు తగ్గనుంది. దీంతో దీని బేస్‌ వేరియంట్‌ ధర రూ.6 లక్షల లోపుకే లభించే అవకాశం ఉంది.

యూరోపియన్‌ కార్లపై ఆకర్షణీయమైన డీల్స్‌:

స్కోడా: పండుగ ఆఫర్లతో కలిపి స్కోడా కార్లపై భారీ ప్రయోజనాలు అందనున్నాయి.

కొడియాక్‌: జీఎస్టీ తగ్గింపు రూ.3.3 లక్షలతో పాటు, పండుగ ఆఫర్లు రూ.2.5 లక్షలు కలిపి మొత్తం రూ.5.8 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

కుషాక్‌, స్లావియా: ఈ మోడళ్లపై కూడా జీఎస్టీ తగ్గింపుతో పాటు పండుగ ఆఫర్లు కలిపి భారీ ప్రయోజనాలు ఉన్నాయి.

రెనాల్ట్‌: రెనాల్ట్‌ కైగర్‌ మోడల్‌పై రూ.96,395 వరకు తగ్గింపు లభించనుంది.

లగ్జరీ కల.. రేంజ్‌ రోవర్‌పై కనీవినీ ఎరుగని తగ్గింపు:

లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో అతిపెద్ద సంచలనం రేంజ్‌ రోవర్‌ సృష్టించనుంది. ఈ కార్ల ధరలు ఏకంగా రూ.30 లక్షలకు పైగా తగ్గనున్నాయి.

రేంజ్‌ రోవర్‌ 4.4ఖ ూప ఒచిః: ఈ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌పై గరిష్టంగా రూ.30.4 లక్షల తగ్గింపు లభించనుంది.

రేంజ్‌ రోవర్‌ 3.0ఆ ూప ఒచిః: రూ.27.4 లక్షల వరకు ధర తగ్గనుంది.

డిఫెండర్‌: ఈ ఐకానిక్‌ ఎస్‌యూవీపై రూ.18.6 లక్షల వరకు, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ మోడల్‌పై రూ.19.7 లక్షల వరకు ప్రయోజనం లభించనుంది.

డిస్కవరీ, వెలార్‌, ఎవోక్‌ వంటి ఇతర మోడళ్లపై కూడా రూ.4.6 లక్షల నుంచి రూ.9.9 లక్షల వరకు ధరలు తగ్గనున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....