Gold వెండి ధరలు తగ్గుతాయా

ముంబై, సెప్టెంబర్‌ 6, (ఇయ్యాల తెలంగాణ) :  బుధవారం జరిగిన 56వ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌ తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను ప్రకటించింది. జీఎస్టీని ప్రస్తుత నాలుగు`శ్లాబ్‌ నిర్మాణం 5, 12, 18, 28 శాతం నుండి 5, 18 శాతం రెండు`శ్లాబ్‌ నిర్మాణానికి కుదించారు. కానీ, హై`ఎండ్‌ కార్లు, పొగాకు, సిగరెట్లు వంటి కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు ప్రత్యేక 40 శాతం స్లాబ్‌ ప్రవేశపెట్టారు. ఈ కొత్త జీఎస్టీరేట్లు సెప్టెంబర్‌ 22 నుంచి అమలులోకి వస్తాయి.జూలై 1, 2017న ప్రవేశపెట్టినప్పటి నుండి జీఎస్టీ వ్యవస్థ అతిపెద్ద సంస్కరణను చూసింది. చాలా రోజువారీ గృహావసర వస్తువులు తక్కువ పన్ను శ్లాబులలోకి వచ్చే అవకాశం ఉంది, కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత చౌకగా ఉంటాయి. జీఎస్టీ స్లాబ్‌ మార్పుల తర్వాత బంగారం, వెండిపై జీఎస్టీ రేటు మారలేదు.బంగారం, వెండి ఆభరణాలపై జీఎస్టీ 3 శాతం వద్దే ఉంది.

తయారీ ఛార్జీలపై అదనంగా 5 శాతం ఉంటుంది. అదే సమయంలో బంగారు నాణేలు, కడ్డీలు 3 శాతం జీఎస్టీని కలిగి ఉంటాయి. అందువల్ల జీఎస్టీ 2.0 సంస్కరణలు బులియన్ల డిమాండ్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవు. విూరు భారతదేశంలో 10 గ్రాముల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు, విూరు బంగారం విలువపై 3 శాతం జీఎస్టీ, తయారీ ఛార్జీలపై అదనంగా 5 శాతం జీఎస్టీ చెల్లిస్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....