ECI చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ SIR కొనసాగేనా ?

న్యూఢిల్లీ, నవంబర్  08 (ఇయ్యాల తెలంగాణ) : భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ, ఓటర్ల జాబితాలను డిజిటల్‌ యుగానికి అనుగుణంగా మార్చే ప్రయత్నం. బిహార్‌లో చేపట్టిన ప్రక్రియ విజయవంతమైంది. లక్షల మంది ఫేక్‌ ఓటర్లు తొలగిపోయారు. దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈసీఐ భావిస్తోంది. అయితే, ఇది రాజకీయ వివాదాలకు కారణమవుతోంది. దేశవ్యాప్తంగా ఫేక్‌ ఓటర్లను గుర్తించి తొలగించాలనే ఈ కార్యక్రమం, డెమోక్రటిక్‌ ప్రాసెస్‌ను బలోపేతం చేస్తుందని ఈసీఐ చెబుతుంటే, వ్యతిరేకవాదులు ఇది ఓటర్ల హక్కులను దెబ్బతీస్తుందని ఆరోపిస్తున్నారు.ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితాలను విస్తృతంగా సవిూక్షించి, అక్రమ ఎంట్రీలను తొలగించే ప్రక్రియ. దీని ద్వారా జన్మస్థలం, ఆధార్‌ వంటి డాక్యుమెంట్లను ధ్రువీకరించి, డూప్లికేట్లు, అన్‌వెరిఫైడ్‌ రికార్డులను ఇన్‌స్పెక్ట్‌ చేస్తారు. 2025లో రెండో దశలో 9 రాష్ట్రాలు (ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌) మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలు (అండమాన్‌ ? నికోబార్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి)లో మొదలైంది. మొత్తం 321 జిల్లాల్లో 1,850 అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్‌ చేస్తూ, 10 లక్షల మంది అధికారులు పాల్గొంటారు.

డిసెంబర్‌ 4 నాటికి పూర్తి అవుతుందని ఈసీఐ ప్రకటించింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి డిజిటల్‌ టూల్స్‌ను ఉపయోగిస్తుంది, కానీ దీని అమలులో రాజకీయ పక్షాల నుంచి వ్యతిరేకత వస్తోంది.బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ విజయవంతమైంది. ఎస్‌ఐఆర్‌ తర్వాత 65 లక్షల మంది ఫేక్‌ ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఇందులో డూప్లికేట్లు, మర్గదార్శకాలు అక్రమ ఎంట్రీలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ఈ ప్రక్రియ సుప్రీం కోర్టులో సవాల్‌ చేయబడిరది. ఎందుకంటే 30 లక్షల మంది చట్టబద్ధ ఓటర్లు తొలగించబడ్డారని కాంగ్రెస్‌ వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలి విశ్లేషణలు, 14 లక్షల డూప్లికేట్లు, 1.32 కోట్లు కుటుంబాల మధ్య మిక్సప్‌లను తెలియజేస్తున్నాయి, ఇది ప్రక్రియలో లోపాలను సూచిస్తోంది. బిహార్‌ అనుభవం, ఎస్‌ఐఆర్‌ సామర్థ్యాన్ని చూపిస్తూనే, అమలు లోపాలు, రాజకీయ దుష్ప్రయోగాల అవకాశాలను కూడా హైలైట్‌ చేస్తోంది.ఓటర్‌ డేటా అసమతుల్యతలు పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువ. అయినా అక్కడి అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్‌ను వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో. ఆమె కోల్‌కతాలో పెద్ద ర్యాలీ నిర్వహించి, ‘ఒక్క చట్టబద్ధ ఓటర్‌ తొలగిస్తే బీజేపీ పతనం తప్పదని హెచ్చరించారు. ఈసీఐ అధికారులు రాష్ట్ర సిబ్బందిని బెదిరిస్తున్నారని, ఇది ఎన్‌ఆర్సీ లాంటి వ్యవస్థగా మారవచ్చని ఆమె ఆరోపణలు చేశారు.

డేటా విశ్లేషణల ప్రకారం, 2023 నుంచి జనాభా 13.8% పెరిగినప్పటికీ, ఓటర్ల సంఖ్య 61.6% పెరిగింది, ఇది 1.04 కోట్ల అదనపు ఓటర్ల అవకాశాన్ని సూచిస్తోంది. ఈసీఐ అసాధారణ పెరుగుదలను గుర్తించి, డేటా మ్యాపింగ్‌ పూర్తి చేసింది, కానీ టీఎంసీ పార్టీ ఇది రాజకీయ ఆయుధంగా మారవచ్చని భయపడుతోంది. ఈ వివాదం, ఓటర్‌ లిస్ట్‌ ఇన్‌ఫ్లేషన్‌ను ఎలా నియంత్రించాలో దేశానికి సవాలుగా మారింది. కేరళలోనూ తేడాలు ఉన్నాయి. రాష్ట్ర జనాభా 3.60 కోట్లు ఉండగా, ఆధార్‌ కార్డులు 4.09 కోట్లు ఉన్నాయి, అంటే 49 లక్షల అదనపు కార్డులు. ఇవి రేషన్‌ కార్డులతో లింక్‌ అయి, పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌లో దుర్వినియోగానికి దారితీస్తున్నాయని విమర్శకులు చెబుతున్నారు. రాష్ట్రంలో 32 లక్షల బోగస్‌ రేషన్‌ కార్డులు ఉన్నాయని పాత అంచనాలు ఉన్నాయి, ఆధార్‌ లింకింగ్‌ ద్వారా చాలా తొలగించబడ్డాయి. వనరుల రక్షణ, సవాళ్లు సర్‌తోపాటు ఆధార్‌ ఆధారిత వెరిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 5.8 కోట్ల ఫేక్‌ రేషన్‌ కార్డులు తొలగించబడ్డాయి, ఇది పీడీఎస్‌ వ్యవస్థను శుద్ధి చేసి, బ్లాక్‌ మార్కెట్‌ లీకేజీలను తగ్గించింది.సమతుల్య అమలు కోసం సూచనలు సర్‌ ప్రక్రియ భారత డెమోక్రసీకి అవసరమైన సంస్కరణ. ఎందుకంటే ఇది ఫేక్‌ ఎంట్రీలను తొలగించి, నిజమైన ఓటర్ల హక్కులను రక్షిస్తుంది. అయితే, బిహార్‌, బెంగాల్‌ వంటి ఉదాహరణలు చూపిస్తున్నట్టు, రాజకీయ జోక్యాలు, టెక్నికల్‌ లోపాలు దీన్ని సున్నితంగా మారుస్తున్నాయి. ఈసీఐకు స్వతంత్ర విమర్శకుల సలహాలు, డేటా ట్రాన్స్‌పరెన్సీ, రాష్ట్రాలతో సమన్వయం అవసరం

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....