జిల్లా సైన్స్ అధికారికి మహాత్మా చరఖా అవార్డు

హైదరాబాద్‌, జూలై 14 (ఇయ్యాల తెలంగాణ) :  50 సంవత్సరముల స్వర్ణోత్సవాల సందర్బంగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు, మహాత్మా చరఖా అవార్డుల ప్రధానోత్సవం కార్యకమంలో భాగంగా పలువురు ప్రతిభా వంతులకు పురస్కారాలు అందజేసింది. ఇందులో భాగంగా ఈ నెల 13 వ తేదీన గాంధీ భవన్ ప్రకాశం హాల్లో అవార్డు  ప్రధానం చేసింది. హైదరాబాద్  జిల్లా సైన్స్ అధికారి సీ ధర్మేందర్ రావ్ సేవలను గుర్తించి మహాత్మా చరఖా అవార్డు  ప్రధానం చేశారు. గాంధీ జ్ఞాన్ ప్రతి స్థాన్ , గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ  సందర్బంగా, గాంధీ భవన్ ప్రకాశం హాల్లో  డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి  చైర్మన్ , డాక్టర్ గాంధారి ప్రభాకర్  కన్వీనర్, డాక్టర్ యానాలా ప్రభాకర్ రెడ్డీ  సెక్రటరీ, జిల్లా సైన్స్ అధికారి సీ ధర్మేందర్ రావ్ సేవలకు గాను మహాత్మా చరఖా అవార్డు  అందించింది ఈ మేరకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా సైన్స్ అధికారి ధర్మేందర్ రావు మాట్లాడుతూ తనకు మహాత్మ చరఖా అవార్డు లభించడం ఏంతో సంతోషంగా ఉన్నదని, కష్ట పడే వారికీ సమాజంలో ఎప్పటికి విలువ ఉంటుందని దీనికి ప్రస్తుతం నాకు అందించిన అవార్డు అని గుర్తు చేశారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....