న్యూఢిల్లీ, జనవరి 24 (ఇయ్యాల తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనాభా లెక్కల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జనాభా లెక్కల నోటిఫికేషన్ను విడుదల చేస్తూ, మొదటి దశలో ఇండ్ల గణన కోసం అడిగే 33 ప్రశ్నల జాబితాను వెల్లడించింది. డిజిటల్ పద్ధతిలో జరగనున్న ఈ భారీ ప్రక్రియ కోసం యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. తొలి దశలో విÖ ఇంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల వివరాలు, వసతులపై దష్టి సారించనున్నారు.
👉 సర్వేయర్లు అడిగే ప్రశ్నల జాబితా ఇలా ఉంది
👉ఇంటి నిర్మాణం: ఇంటి గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్కు వాడిన పదార్థాలు ఏంటి?
👉 నివాస వివరాలు: ఇంటి సంఖ్య, ఇంటి యాజమాన్య స్థితి, కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, గదుల సంఖ్య.
కుటుంబ పెద్ద వివరాలు: యజమాని పేరు, వారు షెడ్యూల్డ్ లేదా ఇతర వర్గాలకు చెందినవారా అనే సమాచారం.
కనీస వసతులు: తాగునీటి వనరు, నీటి లభ్యత, కరెంటు సౌకర్యం, మరుగుదొడ్డి రకం, డ్రైనేజీ వ్యవస్థ వివరాలు.
వంటగది: వంటకు వాడుతున్న ఇంధనం , వంటగది సౌకర్యం ఉందా లేదా?
డిజిటల్ ఆస్తులు ? ఇతర వస్తువుల వివరాలు
రేడియో` ట్రాన్సిస్టర్, టెలివిజన్.
ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాప్టాప్, కంప్యూటర్.
మొబైల్ ఫోన్, స్మార్ట్ఫోన్ వివరాలు
సైకిల్, స్కూటర్, కారు లేదా వ్యాన్ వివరాలు.
ప్రధానంగా వినియోగించే తణధాన్యాల వివరాలు
👉 ఎంతమందికి ఒక సర్వేయర్?
ఈ బహత్తర కార్యాన్ని నిర్వహించడానికి భారత రిజిస్టార్ జనరల్ కఠిన నిబంధనలను రూపొందించారు:
సర్వేయర్లు: 1990 జనాభా లెక్కల చట్టం ప్రకారం ఉపాధ్యాయులు, ప్రభుత్వ గుమస్తాలు, స్థానిక అధికారులను ఎన్యూమరేటర్లుగా నియమిస్తారు.
పని భారం: ప్రతి సర్వేయర్కు 700 నుండి 800 మంది జనాభాను లెక్కించే బాధ్యత అప్పగిస్తారు.
పర్యవేక్షణ: ప్రతి ఆరుగురు సర్వేయర్లకు ఒక సూపర్వైజర్ ఉంటారు. అత్యవసర పరిస్థితుల కోసం 10శాతం అదనపు సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతారు.
అధికారులు: జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, మేజిస్టేట్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.