Betting, గ్యాంబ్లింగ్‌ Appలపై కేంద్రం కొరఢా !

న్యూ ఢిల్లీ, జనవరి 18, (ఇయ్యాల తెలంగాణ) : బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్లపై కేంద్రం కొరఢా రaుళిపించింది. ఆన్‌లైన్‌ జూదం, బెట్టింగ్‌ వల్ల యువత ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు కేంద్రం తాజాగా 242 చట్ట విరుద్ధమైన వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసింది. అక్టోబర్‌ 2025 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త గేమింగ్‌ చట్టం ప్రకారం ఇప్పటివరకు దాదాపు 8 వేల వెబ్‌సైట్లపై నిషేధం విధించింది. నగదు ప్రమేయం ఉన్న ఆన్‌లైన్‌ గేమ్స్‌ను నిర్వహిస్తే భారీ జరిమానాలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, జూదం వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. జనవరి 16వ తేదీన (శుక్రవారం) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 242 చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. దేశ యువతను ఈ చెడు వ్యసనాల నుంచి కాపాడటమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా బ్లాక్‌ చేసిన 242 సైట్లతో కలిపి.. ఇప్పటివరకు దేశంలో మొత్తం 7,800 కంటే ఎక్కువ బెట్టింగ్‌, జూదపు ప్లాట్‌ఫామ్‌లను నిలిపివేశారు. గత ఏడాది తీసుకొచ్చిన కొత్త చట్టం తర్వాత ఈ చర్యలు మరింత వేగవంతం అయ్యాయి.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగాన్ని క్రమబద్ధీ కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాక్ట్‌ 2025 ను అమలులోకి తెచ్చింది. ఈ కొత్త చట్టం 2025 అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. డబ్బుతో కూడిన అన్ని రకాల ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌ సైట్లపై ఈ చట్టం పూర్తిగా నిషేధం విధిస్తుంది. ఇందులో నైపుణ్యంతో కూడిన ఆటలైనా లేదా అదృష్టంపై ఆధారపడే ఆటలైనా నగదు ప్రమేయం ఉంటే అవి చట్టవిరుద్ధమేనని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ చట్టం ప్రకారం చట్టవిరుద్ధమైన గేమ్స్‌ నిర్వహించే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం గేమింగ్‌ సేవలను అందించే సంస్థలు.. బెట్టింగ్‌ సైట్లను ప్రచారం చేసే ప్రకటనదారులు, ప్రమోటర్లు.. ఆ ప్లాట్‌ఫామ్‌లకు ఆర్థిక సహకారం అందించే వారిపై ప్రధానంగా చర్యలు తీసుకుంటుంది. ఈ ఆటలు ఆడే ప్లేయర్స్‌పై ప్రస్తుతానికి ఎలాంటి జరిమానాలు విధించబడవని.. కేవలం నిర్వహకులపైనే చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

ఈ`స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం.

అన్ని ఆటలను నిషేధించడం కాకుండా.. విద్య, సామాజిక స్పృహను పెంపొందించే ఈ`స్పోర్ట్స్‌.. ఎడ్యుకేషనల్‌ గేమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటి నియంత్రణకు ఒక ప్రత్యేక అథారిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....