భగ్గుమన్న Gold

ముంబై, జనవరి 6, (ఇయ్యాల తెలంగాణ) : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి గట్టి షాక్‌ తగిలింది. ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్‌ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఇతర అంతర్జాతీయ సంకేతాలు బాగానే ఉన్నప్పటికీ.. 2 రోజుల కిందట అమెరికా తీసుకున్న సంచలన చర్యలు రేట్లు మళ్లీ పుంజుకునేందుకు దారి తీశాయి. దీంతో జీవన కాల గరిష్టాల నుంచి కిందటి వారం పసిడి, వెండి రేట్లు భారీగా దిగి రాగా.. ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో రేట్లు ఇంకా పెరుగుతాయేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది యావత్‌ ప్రపంచానికి షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనెజువేలాపై దాడులు జరిపి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మధురోను బంధించింది. అక్కడి అధ్యక్ష భవనం నుంచి అమెరికాకు తీసుకొచ్చింది. ఇదే సమయంలో అక్కడ అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తాయని ప్రకటించారు. అయితే అకస్మాత్తుగా వెనెజువెలాపై ట్రంప్‌ సర్కార్‌ విరుచుకుపడటంతో యావత్‌ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. దీంతో మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం ఒక కొలిక్కి వస్తుందన్న అంచనాలతో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు కాస్త దిగి రాగా.. ఇప్పుడు అమెరికా ` వెనెజువెలా సంఘర్షణతో మొదటికొచ్చింది.

ఇంటర్నేషనల్‌ మార్కెట్లో 6 గంటల వ్యవధిలో బంగారం, వెండి రేట్లు రికార్డ్‌ స్ధాయిలో ఎగబాకాయి. ఆదివారం రోజు ఈ ధరల్లో మార్పు ఉండదు. ఇక అర్ధరాత్రి 12 దాటిన తర్వాత రేట్లు అదే స్థాయిలో పెరుగుతూ పోయాయి. కిందటి రోజు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ రేటు ఔన్సుకు 4330 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు అది మళ్లీ 4410 డాలర్‌ మార్కు దాటి దూసుకెళ్తుంది. అంటే 6 గంటల్లోనే ఏకంగా 80 డాలర్లకు పైగా పెరిగింది. స్పాట్‌ సిల్వర్‌ రేటు కూడా.. ఔన్సుకు 72 డాలర్ల స్థాయి నుంచి.. 76 డాలర్ల మార్కును తాకింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ధరల పెంపు ప్రభావం దేశీయంగా.. ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుంది.ప్రస్తుతం మాత్రం దేశీయంగా బంగారం, వెండి రేట్లు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌ నగరంలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు తులం రూ.. 1,24,500 వద్ద ఉంది. జనవరి 3న ధర తగ్గగా.. దానికి ముందు 1,2 తేదీల్లో పెరిగింది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో రూ. 1,35,820 వద్ద ఉంది. ఇక వెండి ధర ప్రస్తుతం కిలోకు రూ. 2.57 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు జనవరి 3న రూ. 3 వేలు తగ్గగా.. జనవరి 2న రూ. 4 వేలు పెరిగింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....