
హైదరాబాద్, ఆగస్టు 22, (ఇయ్యాల తెలంగాణ) :పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయి. ఈ నెలాఖరున అనగా ఆగష్టు 31 అర్థరాత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్రశ్రీ సేవలు నిలిపివేయబోతున్నారని సమాచారం. దీనికి కారణం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడమే. జనవరిలో బకాయిల చెల్లింపు గురించి ప్రభుత్వం హావిూ ఇచ్చినా.. అది మాత్రం అమల్లోకి రాలేదు. దీని వల్ల ఆస్పత్రులపై ఆర్థికభారం పడుతుందని.. అందుకే సమస్య పరిష్కారం కోసం ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయబోతున్నట్లు ప్రకటించారు.
సమాజంలో అతి ఖరీదైంది ఏంటంటే నాణ్యమైన వైద్యం పొందడం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, వసత కొరత కారణంగా చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడానికే మొగ్గు చూపుతారు. అక్కడకు వెళ్లామంటే ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలకు ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ ఆరోగ్రశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. మరి పేదవారి పాలిట సంజీవనిలా ఉపయోగపడే ఆరోగ్యశ్రీ సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయని సమాచారం. ఆ వివరాలు..పేదలకు ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ నెల అనగా ఆగస్టు 31 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఇందుకు కారణం ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోవడం. ప్రభుత్వం సకాలంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడతో.. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఏఎన్హెచ్ఏ) ఈ నిర్ణయం తీసుకుంది.
బకాయిల పెండిరగ్ అంశం గురించి గతంలోనే హెచ్చరికలు జారీ చేసినా.. ప్రభుత్వం వాటిని సీరియస్గా పట్టించుకోలేదు. దీంతో ఆగస్టు 31 నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. .రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ నెల 31 అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశ్రీతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్కు కూడా ఈ నిలిపివేత వర్తించనుందని తెలుస్తోంది. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టీఏఎన్హెచ్ఏ తెలిపింది. ఆస్పత్రులపై ఆర్థిక భారం పెరగడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణమని అంటున్నారు.గతంలోనే అనగా ఈ ఏడాది జనవరిలోనే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. చర్చల అనంతరం దీన్ని కొనసాగించేందుకు ఆసుపత్రులు ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేశాయి.
ఆ సమయంలో రూ.1,300`1,400 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం హావిూ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు ఆ హావిూని నెరవేర్చలేదు. అందుకే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు టీఏఎన్హెచ్ఏ తెలిపింది. ఈమేరకు ఆరోగ్యశ్రీ సీఈవోకు టీఏఎన్హెచ్ఏ లేఖ రాసింది.ప్రభుత్వం పెండిరగ్ బకాయిలు చెల్లించకపోవడంతో.. చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితికి వచ్చాయని టీఏఎన్హెచ్ఏ అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుతవం 4`5 నెలల్లో బకాయిలను చెల్లిస్తామని హావిూ ఇచ్చింది. ప్యాకేజీలను కూడా సవరిస్తామని తెలిపింది. కానీ ఆరు నెలలు గడిచినా వీటిని అమలు చేయలేదని తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాలసి వచ్చిందని తెలిపారు