
హైదరాబాద్, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : సౌత్ ఇండియా ఫిలిం ప్రొడ్యూసర్ బొంకు మురళి మళ్ళీ 200 కోట్లతో ఇండియా ఫైల్స్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి తెలంగాణ కు చేరుకున్నారు. హైదరాబాద్ లోని విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. ఇందులో భాగంగా విమానాశ్రయంలో ఆయనను కలసి అభినందనలు తెలుపడంతో పాటు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురు రవి దాస్ టైగర్ ఫోర్స్ పంజాబ్ ప్రతినిధి డాక్టర్ అజయ్ మాల్ కార్యదర్శి పంజాబ్ జగ్గు రసూల్పూర్ అఖిల భారతీయ రవిదాస్ ధరమ్ సంఘటన్ బృందం ప్రమోద్ జీ మహారాజ్ ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
