49వ రోజు భాజపా కరోనా వారియర్స్ అన్న వితరణ

అలుపెరుగని సహాయం

49వ రోజు భాజపా కరోనా వారియర్స్ అన్న వితరణ 



హైదరాబాద్ , మే 14 ( ఇయ్యాల తెలంగాణ )  భాజపా కరోనా వారియర్స్ టీం సనత్ “ఫీడ్ ది నీడి” 49వ రోజు కార్యక్రమానికి సనత్ నగర్ లోని సుభాష్ నగర్ వాస్తవ్యులు  సందీప్ శర్మ  షీలా లు ఆర్థిక సహాయం అందించినట్లు కార్యనిర్వాహకులు భాజపా  మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్ మరియు ఆకూరి శ్రీనివాస్ రావు లు తెలిపారు. 

భాజపా యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ లు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫతేనగర్ వాస్తవ్యులు యార మోహన్ ముదిరాజ్ తో కలిసి స్వామి టాకీస్ కాంప్లెక్స్ లేబర్ అడ్డా వద్ద అన్నార్థులకు ఆహార పొట్లాల వితరణ చేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, లక్ష్మణ్ పటేల్, విట్టల్ మురళి, ఫణిమాల, సరిత శ్రీనివాస్ గౌడ్, మిథుల్ రాజ్, దుర్గ, కార్తీక్ వారణాసి, బంటి, కిషోర్, ధర్మేంద్ర, భాను, రాజు, జె కె ఠాకూర్   తదితరులు సహకారం అందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....