22 తర్వాత ఈ వస్తువులు కొంటే మంచిది

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (ఇయ్యాల తెలంగాణ) : అమెరికా 50 శాతం టారిఫ్‌ కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉూు కౌన్సిల్‌ బుధవారం దేశ పన్ను విధానంలో కొన్ని పెద్ద మార్పులు చేసింది. దీని ప్రకారం, 12 శాతం, 28 శాతం ఉూు స్లాబ్‌లను తొలగించి, 5 శాతం, 18 శాతం కలిగిన రెండు స్లాబ్‌లను ఉంచారు. ఆరోగ్యానికి హాని కలిగించే వాటితో పాటు కొన్ని లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధిస్తామని ప్రకటించారు.  కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్‌ 22 నుండి అమలులోకి వస్తాయి. ఇప్పటివరకూ 12 శాతం లేదా 28 శాతం ఉూు పడే వస్తువులలో చాలా వరకు ఇప్పుడు తక్కువ పన్ను స్లాబ్‌ కిందకు వస్తాయి. దాంతో అవి చౌకగా లభిస్తాయి. ఈ క్రమంలో ఏ వస్తువులను ఇప్పుడు కొనడం లాభదాయకం, సెప్టెంబర్‌ 22 వరకు ఏ వస్తువులను కొనుగోలు చేయకుండా చూడాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ వస్తువులను కొనుగోలు చేయడానికి వేచి ఉండండి

ఎలక్ట్రానిక్‌ ఐటమ్స్‌

ఎయిర్‌ కండిషనర్లు, ఒఇఆ, ఒఅఆ టీవీలు వంటి 32 అంగుళాల కంటే పెద్ద టెలివిజన్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్‌ వాషింగ్‌ మెషీన్‌లపై ఉూుని 28 శాతం నుంచి 18 శాతానికి కేంద్రం తగ్గించింది. కనుక వీటిని సెప్టెంబర్‌ 22 తరువాత చౌకగా కొనవచ్చు. 

వ్యవసాయ సంబంధిత వస్తువులు

ఎరువులపై ఇప్పుడు ఉన్న జీఎస్టీ 12`18 శాతం బదులుగా 5 శాతం పన్ను పడుతుంది. ట్రాక్టర్‌ టైర్లు, విడిభాగాలపై కూడా ఉూుని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ట్రాక్టర్ల కొనుగోలుపై ఇప్పుడు 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. బయో ఫర్టిలైజర్స్‌, సూక్ష్మ పోషకాలు, బిందు సేద్యం, స్ప్రింక్లర్లు, వ్యవసాయం, కోత నూర్పిడి కోసం ఉపయోగించే యంత్రాలపై ఉూుని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీనివల్ల ఈ వస్తువులను కొనేందుకు కొన్ని రోజులు వేచిచూస్తే ప్రయోజనం ఉంటుంది. 

ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు 

థర్మావిూటర్లు, ఆరోగ్య బీమా పాలసీ, జీవిత బీమా పాలసీల ప్రీమియంపై ఉూుని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. మెడికల్‌ ఆక్సిజన్‌, డయాగ్నస్టిక్‌ కిట్లు, రియేజెంట్లు, గ్లూకోవిూటర్లు, టెస్ట్‌ స్ట్రిప్స్‌, కరెక్టివ్‌ కళ్లద్దాలపై 12 శాతం ఉన్న  ఉూుని 5 శాతానికి మార్చారు. 

ఎడ్యుకేషన్‌ సంబంధిత వస్తువులు

పెన్సిల్‌లు, షార్పనర్‌లు, మ్యాప్‌లు, చార్ట్‌లు, గ్లోబ్‌లు, క్రేయాన్‌లు, పాస్టెల్‌లు, పుస్తకాలు, నోట్‌బుక్‌లు, రబ్బరు వంటి ఎడ్యుకేషన్‌ సంబంధించిన వస్తువులపై జీఎస్టీ తొలగించారు. ఇంతకు ముందు వీటిపై 12 శాతం పన్ను విధించేవారు. 

చౌకగా ఆటోమొబైల్‌ ఉత్పత్తులు

పెట్రోల్‌, పెట్రోల్‌ హైబ్రిడ్‌ కార్లు, ఒఖఉ, అఔఉ కార్లు (1200 సీసీతో పాటు 400 ఎఎ కంటే ఎక్కువ సామర్థ్యం లేనివి) వాటిపై ఉూుని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. సెప్టెంబర్‌ 22 తరువాత నుంచి ఈ రేంజ్‌ కార్ల ధరలు దిగొస్తున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....