హైదరాబాద్, ఏప్రీల్ 27 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీ (సీఎస్) గా కె. రామకృష్ణా రావు నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ సీఎస్ గా కొనసాగుతున్న శాంతా కుమారి పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్ గా రామకృష్ణా రావు ను ఖరారు చేసింది. 1990 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రామకృష్ణా రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక శాఖా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఆయన ఆగస్టు మాసంలో రిటైర్డ్ కానున్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించ డంలో ఆయనకున్న అనుభవం తోడ్పడుతుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను సీఎస్ గా నియమించినట్లు సమాచారం
0 కామెంట్లు