హైదరాబాద్, ఏప్రీల్ 14 (
ఇయ్యాల తెలంగాణ) : ఎస్సీ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో భట్జ్ నగర్, కందికల్ గేట్ లో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ డా. భీం రావు అంబేడ్కర్ జయంతి వేడుకల్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పులికంటి నరేష్ డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాబా సాహెబ్ సూచించిన మార్గంలో మనమంతా నడవాలని ఆయన ఆశయాలకనుగుణంగా విద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలను అంది పుచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తి వాసులు అరుణ్, సునీల్, శివకుమార్, రవి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు