
హైదరాబాద్, ఏప్రిల్ 05 (ఇయ్యాల తెలంగాణ) : నవ తరంగిణి సామజిక సంస్కృతిక యువజన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సుల్తాన్ షాహిలోని అశోక్ పిల్లర్ ప్రాంతంలో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవ తరంగిణి అధ్యక్షులు ఎం. ప్రేమ్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో బిజెపి గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఎం. కుమార్, బిజెపి రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పాశం సురేందర్ లు ముఖ్య అథితిగా పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ ను వీడి జనతా పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎదిగిన విషయాన్నీ గుర్తు చేశారు. నిస్వార్థ సేవకునిగా పేద వర్గాలకు అనేక సేవలందించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ అని కొనియాడారు. సమితి సభ్యులు ఒక్కక్కరుగా జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి ఫూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో బి. కరంజయ, పి.లక్ష్మణ్, చేతన్ కుమార్ సూరి, సునీల్ తివారి, డి. దేవానంద్, టి. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు