హైదరాబాద్ : ప్రముఖ కార్పోరేట్ కళాశాల గ్రూప్ శ్రీ చైతన్య కాలేజీలపై దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను అధికారులు సోదాలకు దిగారు. ఆంధ్ర తెలంగాణ తో పాటు ఢల్లీి, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలు నడుస్తున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు, విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని టాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు గుర్తించారు. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకొని లావాదేవీలు జరిపారు. ప్రభుత్వానికి కట్టే టాక్స్ కొరకు మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకుంది శ్రీ చైతన్య యాజమాన్యం.
మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు జరుగుతున్నాయి.
0 కామెంట్లు