Ticker

6/recent/ticker-posts

Ad Code

MLA గా పద్మరావు గౌడ్‌ ప్రమాణము


సికింద్రాబాద్‌,డిసెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్‌ ఎం ఎల్‌ ఏ తీగుల్ల పద్మరావు గౌడ్‌  గురువారం అసెంబ్లీ లో  ఎం ఎల్‌ ఏ గా ప్రమాణం చేశారు. ఎం ఎల్‌ ఏ గా ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. 2014 నుంచివరుసగా మూడో సారి ఎం ఎల్‌ ఏ గా ఎన్నికై సికింద్రాబాద్‌ లో హ్యాట్రిక్‌ సాధించిన పద్మారావు గౌడ్‌ తొలుత 2004 లో ఎం ఎల్‌ ఏ గా ఎన్నికయ్యారు.  అప్పటి ఎన్నికల్లో  ఆయనను 3067 ఓట్ల మెజారిటీలభించింది. తెలంగాణ కోసం రాజీనామా చేసిన అయన  ఆ ఉప ఎన్నికల్లో  విజయం సాధించలేదు.అనంతరం 2014, 2018, 2023ల్లో వరుసగా ఎం ఎల్‌ ఏ గా ఎన్నికయ్యారు. ప్రతి ఎన్నికల్లో ఆయనసాధించిన మెజారిటీ పెరుగుతూ తాజాగా 45,240 ఓట్ల ఆధిక్యతను సాధించి సికింద్రాబాద్‌ లో  హ్యాట్రిక్‌ తో ఎం ఎల్‌ ఏ రికార్డు ను నెలకొల్పారు.ఈ సందర్బంగా అయన ను నియోజకవర్గం లో పలువురుఅభినందనలు తెలిపారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు