సికింద్రాబాద్,డిసెంబర్ 14 (
ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మరావు గౌడ్ గురువారం అసెంబ్లీ లో ఎం ఎల్ ఏ గా ప్రమాణం చేశారు. ఎం ఎల్ ఏ గా ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. 2014 నుంచివరుసగా మూడో సారి ఎం ఎల్ ఏ గా ఎన్నికై సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ సాధించిన పద్మారావు గౌడ్ తొలుత 2004 లో ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు. అప్పటి ఎన్నికల్లో ఆయనను 3067 ఓట్ల మెజారిటీలభించింది. తెలంగాణ కోసం రాజీనామా చేసిన అయన ఆ ఉప ఎన్నికల్లో విజయం సాధించలేదు.అనంతరం 2014, 2018, 2023ల్లో వరుసగా ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు. ప్రతి ఎన్నికల్లో ఆయనసాధించిన మెజారిటీ పెరుగుతూ తాజాగా 45,240 ఓట్ల ఆధిక్యతను సాధించి సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ తో ఎం ఎల్ ఏ రికార్డు ను నెలకొల్పారు.ఈ సందర్బంగా అయన ను నియోజకవర్గం లో పలువురుఅభినందనలు తెలిపారు
0 కామెంట్లు