హైదరాబాద్ నవంబర్ 2 (ఇయ్యాల తెలంగాణ ):పార్క్ హయత్ లో గిరిజన వ్యవస్థాపకుల సక్సెస్ విూట్ కు మంత్రులు కేటీఆర్ , సత్యవతి రాథోడ్ హజరయ్యారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 3వ తేదీ తర్వాత తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. దేవుడు మనిషిని పుట్టించాడు, మనిషి కులాన్ని పుట్టించాడు. ప్రతి మనిషికి సమానమైన తెలివితేటలు ఉంటాయని బలంగా నమ్ముతాను. టాలెంట్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు మాత్రమే కాదని అన్నారు.సరైన సమయంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మనం ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలి..కలల్ని సైతం గొప్పగా కనాలి. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకునే స్ఫూర్తి కలుగుతుంది. సీఎం ఎస్ టి ఈ ప్రోగ్రాం ద్వారా విజయం సాధించిన 500 గిరిజన సోదరులు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలి. గ్రామాలు, గిరిజన తండాల్లో, ఆదివాసీ గుడాలలో ఉన్న యువతరానికి స్ఫూర్తినిచ్చేలా ఈ కార్యక్రమం ఉంది. ఈ ఐదు సంవత్సరాలలో ఈ కార్యక్రమం నడిచిన తీరుపైన అధ్యయనం నిర్వహించి దీన్ని మరింతగా బలోపేతం చేసి, విస్తరించేలా చర్యలు తీసుకోవాలి. 500 మంది ఉన్న ఔత్సాహిక పెట్టుబడిదారుల సంఖ్యను ఐదువేలకు చేరేలా కార్యాచరణ నిర్వహించుకుందామని అన్నారు
0 కామెంట్లు