హైదరాబాద్, నవంబర్ 2, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డబ్బు, బంగారం, మద్యాన్ని పోలీసు అధికారులు గత కొన్ని రోజులుగా స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి వరకు నగదు, బంగారం, మద్యం ఇతర వస్తువులు స్వాధీనం ఏకంగా రూ.412 కోట్ల మార్క్ దాటిందని అధికారులు వెల్లడిరచారు.తెలంగాణలో ఒక్క రోజే రూ.16 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎన్నికల కోడ్ మొదలైన అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 31 వరకు కేవలం 21 రోజుల్లో దాదాపు రూ.412 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం ఇతర వస్తువులను పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జప్తు చేశారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పట్టుబడ్డ నగదు, బంగారం, మద్యం అన్నీ కలిపి కేవలం రూ.103 కోట్లు మాత్రమే. అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు
ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం
? నగదు : రూ.145 కోట్లు
? మద్యం : రూ.40 కోట్లు
? ఆబరణాల : రూ.165 కోట్లు
? మాదకద్రవ్యాలు : రూ.22కోట్లు
? ఇతర వస్తువులు : రూ.39 కోట్లు
? మొత్తం రూ.412 కోట్లు
0 కామెంట్లు