న్యూఢల్లీ అక్టోబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ): కాంట్రాక్టు ఉద్యోగినికీ ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందేనని ఢల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. ప్రసూతి సెలవులను నిరాకరించడం అమానవీయమని పేర్కొంది. కాంట్రాక్టు ఉద్యోగం అనే సాకు చెప్పి సెలవులను నిరాకరించడం ఆమె ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని తెలిపింది.ఢల్లీ యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిలో సహాయకురాలిగా పని చేస్తున్న ఓ ఉద్యోగిని ప్రసూతి సెలవులు తీసుకోగా.. ఆమెను యూనివర్సిటీ సర్వీస్ నుంచి తొలగించింది. దీనిపై ఆమె ఢల్లీహైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ చంద్రధరి సింగ్ విచారణ చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగం అయినంత మాత్రాన నోటీసులు లేకుండా ఉద్యో గం నుంచి తొలగించడం చట్టవిరుద్ధమ ని హైకోర్టు పేర్కొంది. వెంటనే ఆమెను సర్వీసులోకి తీసుకొని, నష్టపరిహారంగా రూ.50 వేలు చెల్లించాలని ధర్మాసనం యూనివర్సిటీని ఆదేశించింది.
0 కామెంట్లు