మెదక్ అక్టోబర్ 11 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలో ఎన్నికల నగారా మోగ డంతో వాహనాల రాకపోకలపై పోలీ సులు నిఘా పెంచారు. సంగారెడ్డి జిల్లా లో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయం పేట మండలం శివారులో 44 జాతీ య రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాహనాల ద్వారా డబ్బు మద్యం తరలించకుండా పోలీసులు అధికారు లు ముందు జాగ్రత్తగా ముమ్మరంగా తనిఖీలు చేపడు తున్నారు.తగిన ఆధారాలు ఉన్నాయా లెవా దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
0 కామెంట్లు