Ticker

6/recent/ticker-posts

Ad Code

ఢల్లీలోని షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

న్యూ డిల్లీ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ ):ఢల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో 30కిపైగా ఫైర్‌టెండర్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పీరాగర్హి మెట్రో స్టేషన్‌కు సవిూపంలో ఉన్న బూట్లకు సంబంధించిన కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు