మేడారం అక్టోబర్ 11 (ఇయ్యాల తెలంగాణ );బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో వారి జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ, యువకులకు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన వెల్లడిరచారు.బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్న కేంద్రమంత్రి.. అనంతరం విూడియాతో మాట్లాడారు. తెలంగానకు గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, దీని నిర్మాణానికి తొలి విడతగా దాదాపు రూ.900 కోట్లను కేటాయించడంతోపాటుగా.. ఈ విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరును పెట్టిన ప్రధానమంత్రికి.. గిరిజన సమాజం తరపున, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, గిరిజన వీరుల త్యాగాలను యావద్భారతం స్మరించుకునేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్బంగా గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు.
హైదరాబాద్ లో రూ. 25 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టబోతున్న విషయాన్ని, 6.5 కోట్ల కేంద్ర నిధులతో గిరిజన పరిశోధన సంస్థ ప్రారంభానికి సిద్దంగా ఉన్న విషయాన్నీ ఆయన వెల్లడిరచారు. ములుగు జిల్లాలోని రుద్రేశ్వర ఆలయం (రామప్ప గుడి)కి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చే విషయంలోనూ ప్రధానమంత్రి ప్రత్యేక చొరవతీసుకున్న విషయాన్ని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు.తెలంగాణ గిరిజన సమాజాభివృద్ధి కోసం.. ఇటీవలే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ములుగులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు పచ్చజెండా ఊపడంతోపాటుగా.. రూ.889 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. ఈ సెంట్రల్ యూనివర్సిటీకి మన ఆరాధ్యదేవతలైన ‘సమ్మక్క`సారక్క గిరిజన విశ్వవిద్యాలయం’గా పేరు పెట్టడం.. గిరిజన సంస్కృతికి, తెలంగాణ సంప్రదాయాలకు మోదీ గారు ఇస్తున్న గౌరవానికి నిదర్శనం. ఈ యూనివర్సిటీ ద్వారా..తెలంగాణ గిరిజన సమాజం రూపురేఖలే మారిపోతాయి. ఇందులో సందేహం లేదు. మన ములుగు జిల్లాలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం.. దీనికి మన వన దేవతల పేర్లు పెట్టడం.. రూ.889 కోట్లు కేటాయించిన సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి విూ అందరి తరపున, తెలంగాణ ప్రజలందరి తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాను.దీంతోపాటుగా గిరిజనుల కోసం ఏకలవ్య మోడల్ స్కూళ్లు, గిరిజన ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, గిరిజన పోరాట యోధులను గౌరవించుకునేలా.. వారి స్మారకంగా.. దేశవ్యాప్తంగా మ్యూజియాల నిర్మాణానికి నిధుల కేటాయింపు చేస్తోంది.దీంట్లో భాగంగానే.. తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా.. స్వాతంత్య్ర పోరాటం, రజాకార్ల ఆకృత్యాలపై పోరాడిన గిరిజన వీరులకు సరైన గుర్తింపును ఇస్తూ.. రూ. 34 కోట్లతో హైదరాబాద్ లోని ఆబిడ్స్ లో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.ఇది కాకుండా.. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్యారంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ వర్గాల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో రూ.420 కోట్లతో.. 17 కొత్త ‘ఏకలవ్య పాఠశాలలను’ కేంద్రం ఏర్పాటుచేసిందదని అన్నారు.
0 కామెంట్లు