Ticker

6/recent/ticker-posts

Ad Code

భారత్‌కు ఛత్రపతి శివాజీ వాడిన WAGH-NAKH ఆయుధం


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9, (ఇయ్యాల తెలంగాణ) : ఛత్రపతి శివాజీ మహరాజ్‌ 1659లో వినియోగించిన ఆయుధం ‘‘వాఘ్ ? నాఖ్ ?’’ని యూకే నుంచి ఇండియాకి రానుంది. పులిగోళ్లను పోలి ఉండే ఈ ఆయుధాన్ని 1659లో అఫ్జల్‌ ఖాన్‌ని చంపేందుకు వాడారు శివాజీ. ప్రస్తుతం ఇది లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియంలో ఉంది. త్వరలోనే యూకే భారత్‌కి ఈ ఆయుధాన్ని తిరిగి ఇవ్వనుంది. ఉ20 సదస్సు కోసం యూకే ప్రధాని రిషి సునాక్‌ భారత్‌కి వచ్చిన క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర ట్వీట్‌ చేసింది. త్వరలోనే ఈ ఆయుధం భారత్‌కి రానుందని వెల్లడిరచింది. శివాజీ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఆయుధాన్ని ఆయన వారసులు ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆఫీసర్‌ జేమ్స్‌ గ్రాంట్‌ డఫ్‌కి ఇచ్చారు. ఇండియాలో సర్వీస్‌ ముగిసిన తరవాత జేమ్స్‌ గ్రాంట్‌ తనతో పాటు ఆ ఆయుధాన్ని బ్రిటన్‌కి తీసుకెళ్లారు. ఆ తరవాత డఫ్‌ వారసులు దాన్ని మ్యూజియంకి అందించారు. అప్పటి నుంచి అక్కడే భద్రపరిచారు. ఈ ఆయుధం వెనక్కి తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్‌ ముంగంతివార్‌ గట్టి ప్రయత్నమే చేశారు. త్వరలోనే ఆయన విక్టోరియా మ్యూజియంలో అంగీకార ఒప్పందం కుదుర్చుకోనున్నారు. దానిపై సంతకం చేయనున్నారు. సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 4వ తేదీల మధ్యలో సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ డైరెక్టర్‌ ప్రతినిధులు, ఆర్కియాలజీ, మ్యూజియం డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధులు విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియంని సందర్శించనున్నారు. ఈ ఆరు రోజుల పర్యటనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే రూ.50 లక్షల నిధులు కేటాయించారు. ‘‘ఛత్రపతి శివాజీ ఆయుధమైన వఫ్‌ు నఖ్‌ అమూల్యమైంది. మహారాష్ట్ర ప్రజలకు ఈ ఆయుధానికి ఎంతో అనుబంధం ఉంది. ఇది తిరిగి భారత్‌కి వస్తుండడం చాలా సంతోషం. ఈ ఆయుధాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. 


అందుకే...రూ.50 లక్షల నిధులు కేటాయించాం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిందే ఇందుకు ఆమోదం తెలిపారు’’ఈ వాఘ్ ? నాఖ్ ? తోనే.. బిజాపూర్‌? సల్తనేట్‌? జనరల్‌? అఫ్జల్‌? ఖాన్‌ను హతమార్చారు శివాజీ. చర్మ, కండరాలను చీల్చుకునే విధంగా ఈ ఆయుధాన్ని రూపొందించారు. సైజు, ఆకారంలో చిన్నగా ఉన్నా.. ప్రత్యర్థులకు బలమైన గాయాలు చేయగలిగే సత్తా ఈ వాఘ్ ? నాఖ్ ? కు ఉంటుంది. ‘‘ఛత్రపతి శివాజీ మహరాజ్‌? పట్టాభిషేకానికి 350ఏళ్లు పూర్తవుతోంది. ఈ ఘట్టాన్ని వేడుకగా చేసుకుంటున్నాము. అందుకే.. వాఘ్ ? నాఖ్ ?ను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. శివ భక్తులందరూ ఈ ఆయుధాన్ని చూడాలి. ప్రధాని మోదీ` అమిత్‌? షాలు చేస్తున్న గొప్ప పనికి ఇది ఒక చిహ్నంగా నిలిచిపోతుంది. బ్రిటన్‌?తో అక్టోబర్‌? 3న ఒక ఎంవోయూపై సంతకం చేస్తాము. వాఘ్ ? నాఖ్ ?ను ఇండియాకు తీసుకొస్తాము. ఈ వాఫ్‌ు?నఫ్‌ు?.. ఈ తరం వారికి స్ఫూర్తిదాయకంగా మారుతుంది,’’ అని మహారాష్ట్ర సాంస్కృతికశాఖ సహాయ మంత్రి సుధీర్‌? ముంగంతివార్‌? వెల్లడిరచారు. ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత.. ఈ వాఘ్ ? నాఖ్ ?ను దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌? వాస్తు సంఘ్రాలయలో ప్రదర్శను ఉంచనున్నట్టు తెలుస్తోంది.


అయితే వాఘ్ ? నాఖ్ ? ఆయుధంపై విక్టోరియా అండ్‌? ఆల్బర్ట్‌? మ్యూజియం వాదన మరో విధంగా ఉంది. ఈ ఆయుధం.. ఈస్ట్‌? ఇండియా కంపెనీ అధికారి జేమ్స్‌? గ్రాంట్‌? డుఫ్‌?కు చెందిందని చెబుతోంది. మరాఠా పేషాకు చెందిన ప్రధాని నుంచి ఆయన దీనిని గిఫ్ట్‌?గా పొందారని అంటోంది. కానీ ఆ ఆయుధంపై ఉన్న బ్లేడ్స్‌? విూద.. ‘మొఘల్‌? జనరల్‌?ను హతమార్చిన శివాజీ వాఘ్ ? నాఖ్ ?' అని రాసి ఉంది. అఫ్జల్‌? ఖాన్‌? హత్య.. మరాఠా చరిత్రలోనే అతి కీలకమైన ఘట్టం. భారీ మొత్తంలో సైన్యం ఉన్నప్పటికీ.. మరాఠా యోధులు రచించి మాస్టర్‌? ప్లాన్స్‌? ముందు ఖాన్‌? బృందం నిలబడలేకపోయింది. మరీ ముఖ్యంగా.. అఫ్జల్‌? ఖాన్‌?ను ఇదే వాఫ్‌ు? నఫ్‌ు?తో ఛత్రపతి శివాజీ హతమార్చారు. ఇదొక ఐరన్‌? వెపన్‌?.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు