Ticker

6/recent/ticker-posts

Ad Code

BJYM మైనంపల్లి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ


సికింద్రాబాద్‌ సెప్టెంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ ): అల్వాల్‌ లో  బీజేవైఎం కార్యకర్తలు, ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రాక్‌ ల్యాండ్‌ రెవెన్యూ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైనంపల్లి అనుచరులు రాంగ్‌ ల్యాండ్‌ రెవెన్యూలో కబ్జా చేశారంటూ బాధితులె  ఆరోపించారు. బాధితుల పక్షాన నిలిచిన బీజేవైఎం కార్యకర్తలు . రాక్‌ లైన్‌ రెవెన్యూ కార్యాలయ అద్దాలు గోడలను ధ్వంసం చేసారు. రెవెన్యూ మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడం కారణంగానే తాము రంగంలోకి దిగినట్లు  బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయిప్రసాద్‌ వెల్లడిరచారు. అద్దాలు ధ్వంసం చేస్తున్న తరుణంలో మైనంపల్లి అనుచరులు ఒక్కసారిగా రంగ ప్రవేశం చేసారు. బీజేవైఎం నాయకులపై రాళ్లు కర్రలతో విచక్షణ రైతంగా దాడికి పాల్పడ్డారు. బీజేవైఎం నాయకులను కర్రలతో తరిమికొట్టారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు