ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 12 భారీ స్టోరేజ్ రిజర్వాయర్లను నిర్మించబోతున్నారు. వీటి నిల్వ సామర్థ్యం 12 మిలియన్ లీటర్లు ఉంటుంది. 615 కిలో విూటర్ల మేర నీటి పంపిణీ పైప్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,376 కోట్లు. ఓఆర్ఆర్ చుట్టూ 3 విూటర్ల వ్యాసార్థంతో భారీ పైప్ లైన్ ను నిర్మించబోతున్నారు. ఈ పైప్ లైన్ కోసం ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఓఆర్ఆర్ లోపల 18 చోట్ల రేడియల్ మెయిన్ పైప్ లైన్లను నిర్మిస్తారు. అలాగే ఈ రేడియల్ పైప్ లైన్ కోసం రూ.250 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు కనుక విజయవంతంగా పూర్తి అయితే నగరంలో 24 గంటల నీటి సరఫరాకు అవకాశం ఉంటుంది. నగరం అంతటా కృష్ణా, గోదావరి, మంజీరా సింగూరు జలాలు విస్తరిస్తారు. ఏటా 20 టీఎంసీల నీటిని తరలించవచ్చు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే నగరంలో 24 గంటల వాటర్ సప్లై ఇవ్వొచ్చని జీహెచ్ఎంసీ భావిస్తోంది.
0 కామెంట్లు