Ticker

6/recent/ticker-posts

Ad Code

రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బాబాసాహెబ్ విగ్రహానికి బీఎస్పీ పాలాభిషేకం


హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఇయ్యాల తెలంగాణ) : భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర ప్రసాద్ పై పిడి యాక్ట్,, ధేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ... బీఎస్పీ నాయకులు ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబెడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు సహకరించిన, ప్రోత్సహించిన నాయకులపై కూడా తగిన చర్యలు తీసుకొని వారిని అరెస్టు చేయాలని బి.ఎస్.పి పార్టీ నాయకులూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పాలతో అభషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదారాబాద్ బీఎస్పీ నాయకులు, హైదరబాద్ జిల్లా బీఎస్పీ అద్యక్షుడు చాట్ల చిరంజీవి, సికింద్రాబాద్ నియోజక వర్గం  అద్యక్షులు సునిల్, ఛార్మినార్ నియోజక వర్గం అధ్యక్షులు మూల రామ్ చరణ్ దాస్ గ్రేటర్ హైదారాబాద్ బీఎస్పీ నాయకులు, ఇతర నియోజక వర్గం కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు