Ticker

6/recent/ticker-posts

Ad Code

న్యాయ వాదుల ప్రొటెక్షన్ ఆక్ట్ ఏర్పాటు చేయాలి - TNSS


హైదరాబాద్, డిసెంబర్ 4 (ఇయ్యాల తెలంగాణ) :  అడ్వకేట్ లపై రోజు రోజుకి దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ న్యాయ వాదుల సురక్ష సమితి TNSS ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో న్యాయవాదులపై కోర్టు బయట దాడులు జరిగేవని ప్రస్తుతం కోర్టు లోపల దాడులు జరుగుతున్నాయని TNSS ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవాదుల కోసం న్యాయ వాదుల ప్రొటెక్షన్ ఆక్ట్ తీసుకు రావాలని కోరారు. ఈ విషయమై అడ్వకేట్ జనరల్ బి. ఎల్. ప్రసాద్ కు TNSS వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ కార్యక్రమంలో TNSS అధ్యక్షులు అశోక్ కుమార్ సంయుక్త కార్యదర్శి రాకేష్ కులకర్ణి ప్రధాన కార్యదర్శి అహ్మద్ పాషా ఉపాధ్యక్షులు ఏ. సత్యనారాయణ కోశాధికారి దేవేందర్ లు పాల్గొన్నారు.   



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు