హైదరాబాద్, డిసెంబర్ 15 (
ఇయ్యాల తెలంగాణ) : ఉక్కుమనిషి, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా ముదిరాజ్ కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ సర్దార్ వల్లభాయ్ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ పటేల్ సాహసం ఆయన సేవలు చరిత్రలో ఎన్నటికీ నిలిచి ఉంటాయని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
0 కామెంట్లు