Ticker

6/recent/ticker-posts

Ad Code

పార్టీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు : తీగుల్ల పద్మారావు

సికింద్రాబాద్‌, ఫిబ్రవరి 26 (ఇయ్యాల తెలంగాణ) : పార్టీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పిస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్‌ స్పష్టం చేశారు. సితాఫలమండీ డివిజన్‌ కు చెందిన తెరాస పార్టీ కార్యకర్త  సంతోష్‌ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు.  అయన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమాచారం తెలుసుకున్న పద్మారావు గౌడ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి రూ.ఐదు లక్షల మేరకు నిధులను మంజూరు చేయించారు. రూ. అయిదు లక్షల చెక్కును శనివారం షాబాజ్‌ గూడా లోని దివంగత  సంతోష్‌ కుమార్‌ నివాసంలో ఆయన సతీమణి  అనిత కు అందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు