Ticker

6/recent/ticker-posts

Ad Code

ఆయుష్మాన్‌ భారత్‌తో దేశ ఆరోగ్యరంగానికి జవసత్వాలు

అందరికీ ఉపయోగపడేలా చేపట్టిన ఆరోగ్య మిషన్‌ 


దేశ ఆరోగ్య రంగంలో  స్వయంసమృద్ధిని సాధిస్తుంది

వారణాసిలో పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

వారణాసి,అక్టోబర్‌25(ఇయ్యాల తెలంగాణ): ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా దేశ ఆరోగ్య రంగానికి జవసత్వాలు కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దేశ ఆరోగ్య సదుపాయాలకు నూతన జవసత్వాలు వస్తాయన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దామన్నారు.  ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉత్తర ప్రదేశ్‌ లోని వారణాసిలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ పథకం భారత దేశ ఆరోగ్య రంగంలో ఆత్మ విశ్వాసాన్ని, స్వయంసమృద్ధిని నింపుతుందన్నారు. ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అతి పెద్ద, అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటి ఆరోగ్య రంగంలో పెట్టుబడులని మనం ఎప్పుడూ విశ్వసిస్తామని చెప్పారు. కోవిడ్‌`19 మహమ్మారిపై పోరాటంలో 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ మైలురాయిని దాటినందుకు భారత దేశాన్ని మోదీ అభినందించారు.  కాశీ విశ్వనాథుడు, గంగమ్మ తల్లి, కాశీ ప్రజల ఆశీర్వాదాల వల్ల ’అందరికీ టీకా, ఉచిత టీకా’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. దీపావళి, ఛాత్‌ తదితర పండుగలను దేశమంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు. అయితే జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్‌ మహమ్మారి ఇంకా మననుంచి దూరం కాలేదన్నారు. మాస్కులు దరించడం మరవ వద్దన్నారు. అంతకుముందు మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని సిద్దార్థ నగర్‌ నుంచి తొమ్మిది వైద్య కళాశాలలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పాల్గొన్నారు. పీఎం ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను వారణాసి నుంచి ప్రారంభించినం దుకు మోదీకి యోగి ఆదిత్యనాథ్‌ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నాం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను మోదీ ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్‌ లో కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభించడం వల్ల మెడికల్‌ సీట్లు మరియు డాక్టర్ల సంఖ్యపై సానుకూల ప్రభావం ఉంటుందన్నారు. సీట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, ఇప్పుడు పేద తల్లిదండ్రుల పిల్లలు కూడా డాక్టర్‌ కావాలని కలలు కనడంతో పాటు మరియు దానిని నెరవేర్చుకోవచ్చన్నారు. స్వాతంత్యర్ర వచ్చిన 70 ఏళ్లలో వైద్య కళాశాలల నుంచి బయటకు వచ్చిన డాక్టర్ల సంఖ్య కంటే వచ్చే 10`12 ఏళ్లలో దేశం చాలా మంది వైద్యులను అందుకోబోతోందని మోదీ అన్నారు. కాశీ పట్ల అనుబంధం, కాశీ అభివృద్ధి, కాశీ వారసత్వ సంపద పట్ల ప్రధాన మంత్రి అభిప్రాయాలు అందరికీ తెలుసని యోగి అన్నారు. ఈరోజు రూ. 5,100 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు కాశీలో ప్రారంభించబడుతున్నాయన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు