Ticker

6/recent/ticker-posts

Ad Code

మరణించినవారందరకీ పరీక్షలు సాధ్యం కావు


స్పష్టం చేసిన మంత్రి ఈటెల  రాజేందర్‌


హైదరాబాద్‌,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ ): మృతి చెందిన వారికి కొవిడ్‌ పరీక్షలు  చేయాలనడం అశాస్త్రీయమైనదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల  రాజేందర్‌ వ్యాఖ్యానించారు. మృతులందరికీ కరోనా పరీక్షలు  చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో విూడియాతో ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడిన వారికి గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పారు. కరోనా సోకిన వారందరినీ బతికించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు  తమ ప్రాణాలను లెక్కచేయకుండా వైద్య సేవలు  అందిస్తున్నారని కొనియాడారు. చనిపోయిన వారికి కొవిడ్‌ పరీక్షలు  చేయాలనడం అవగాహన రాహిత్యంతో కూడుకున్నది. ఐసీఎంఆర్‌ నిబంధనల్లో ఎక్కడ కూడా భౌతిక కాయానికి పరీక్షలు  నిర్వహించాలని చెప్పలేదు. రాష్ట్రంలో నిత్యం వెయ్యిమంది మరణిస్తున్నారు. దేశంలో నిత్యం 30వేల  మంది చనిపోతున్నారు. వారందరికీ టెస్టు చేయడం సాధ్యం కాదని ఈటల  స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు