Ticker

6/recent/ticker-posts

Ad Code

కాంగ్రెస్‌ మంజీర యాత్రకు ప్రభుత్వం బ్రేక్‌ - మరోమారు నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు

అక్రమాలతో గట్టెక్కే ప్రాజెక్టులకే సిఎం కెసిఆర్ ` మొగ్గు


ఆయనకు అనుభవంతో పాటు ముందు చూపు లేదు
కేసీఆర్‌ మెదక్‌ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు
హౌజ్‌ అరెస్ట్‌తో పోలీస్‌ రాజ్యం నడుస్తోందన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి



హైదరాబాద్‌,జూన్‌4(ఇయ్యాల తెలంగాణ): సీఎం కేసీఆర్‌కు అనుభవంతో పాటు ముందుచూపు కూడా లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌లో మే 2018 నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి పని కూడా ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ, సీతారామా ప్రాజెక్టులో అక్రమాకు పాల్పడ్డారని  ఆయన అన్నారు. ఆ ప్రాజెక్టుపై చూపించే ప్రేమ మరి ఎస్‌ఎల్‌బీసీ విూద ఎందుకు చూపించరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన ఆరేళ్ల తర్వాత కూడా ఎస్‌ఎల్‌బీసీ ఎందుకు పూర్తి కాలేదని ఆయన ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసం వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ప్రాజెక్టు పరిశీలన పేరుతో జల దీక్షకు కాంగ్రెస్‌ పార్టీ పూనుకున్న నేపథ్యంలో  సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్‌ పరిశీలనకు వెళ్లేందుకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సహా పలువురు నేతలు  సిద్ధమయ్యారు. దీంతో ఉత్తమ్‌ ఇంటి వద్దకు పోలీసులు  చేరుకుని వారు వెళ్లకుండా అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాల  కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్‌ పార్టీ నిరసనలు  వ్యక్తం  చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కృష్ణా పరవాహక ప్రాంత ప్రాజెక్టులను సందర్శించేందుకు వెళ్లిన నేతలను పోలీసులు  అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో గురువారం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్‌ పరిశీలనకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెళ్లనుండా పోలీసులు  అడ్డుకున్నారు.  
హౌస్‌ అరెస్టు కావడంతో ఉత్తమ్‌ తన ఇంట్లో విూడియాతో  మాట్లాడారు. ప్రాజెక్టులన్నీ కవిూషన్ల కోసమే నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని ఎందుకు వాడుకోవడంలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావసరాలు  తీరే వరకు పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌.. మెదక్‌ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.  సింగూరు ప్రాజెక్ట్‌, మంజీర డ్యాం నుంచి ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించిందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు  ఆరోపిస్తున్నారు. నీళ్లు తరలించడం వల్లే సంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు  వచ్చాయని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆహ్వానం మేరకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నేతలు, ప్రజా ప్రతినిధులు  గురువారం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్‌ పరిశీలనకు వెళ్లాలని అనుకున్నారు. అయితే వారిని పోలీసులు  బయటకు రాకుండా.. ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. పోలీసులు  ప్రభుత్వానికి తొత్తుగా మారోద్దని ఆయన అన్నారు. ’కొండపోచమ్మసాగర్‌ ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ పదివేల  మందితో ప్రారంభించారు. మంత్రులు  జిల్లాల్లో నూతన వ్యవసాయ సాగు విధానం గురించి అవగాహనా కార్యక్రమాలు  ఏర్పాటు చేస్తున్నారు. మరి వారికి లేని రూల్స్‌.. మాకే వర్తిస్తాయా’ అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు  కల్వకుంట్ల సైన్యం కావొద్దని ఆయన అన్నారు. ప్రజలకు ఒక చట్టం.. కల్వకుంట్ల  వారికి ఒక చట్టం ఉంటుందా అని ఆయన పోలీసులను ప్రశ్నించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు