Ticker

6/recent/ticker-posts

Ad Code

రాష్ట్రంలో ప్రమాదకరంగా కరోనా పరిస్థితి

కేసులు  పెరుగుతున్నా పట్టింపులేని సర్కార్‌: బండి


]హైదరాబాద్‌,జూన్‌8(ఇయ్యాల తెలంగాణ): రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా  ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రధానంగా కరోనా విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. డాక్టర్లకే దిక్కు లేకుండా పోయిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఏం జరిగినా కేంద్రమే చెప్పిందంటున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు  భారీగా పెరుగుతున్న చికిత్స ట్రీట్మెంట్‌ చేస్తున్న డాక్టర్లకు వసతి కల్పించడం లేదన్నారు. ట్రీట్మెంట్‌ చేస్తున్న డాక్టర్లకు ఎన్‌`95 మాస్కులు  లేవన్నారు. కరోనా హెల్త్‌ బులిటెన్‌ కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. టెస్టులు  చేయకుండానే రాష్ట్రంలో కేసుల  సంఖ్య పెరిగిందన్నారు. టెస్టులు  పెరిగితే కేసులు  చాలా పెరుగుతున్నాయన్నారు. కరోనా వచ్చినా డ్యూటీ చేయాలని పీజీ డాక్టర్లను బెదిరిస్తున్నారన్నారు. పీజీ మెడికల్‌ స్టూడెంట్స్‌కు టెస్టులు  ఎందుకు చేయడం లేదన్నారు. గాంధీ, ఉస్మానియాలో స్టాఫ్‌ లేరన్న విషయాన్ని కూడా పెద్దగా  పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌ అన్నారు. ఇంత దారుణంగా పరిస్తితులు  ఉన్నా,రోజురోజుకు కరోనా కేసులు  పెరుగుతున్నా సిఎం కెసిఆర్‌ పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు