Ticker

6/recent/ticker-posts

Ad Code

జూడాలతో మంత్రి ఈటెల చర్చలు సఫలం


ఆందోళన విరమించిన డాక్టర్లు
హైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల  రాజేందర్‌తో బుధవారం జరిపిన చర్చలు  ఫలప్రదం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్లు  ప్రకటించారు. జూడాల  డిమాండ్లపై మంత్రి ఈటల  సానుకూలంగా స్పందించారు. ఆందోళన విరమించిన జూడాలు  విధుల్లో చేరుతున్నారు. ప్రధానంగా ఐదు డిమాండ్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. డాక్టర్లతో మంత్రి ఈటల  సమావేశం అయ్యారు. గాంధీ హాస్పిటల్‌లో డాక్టర్‌ల పై దాడిని ఖండిస్తూ జూనియర్‌ డాక్టర్ల ఆందోళన కొనసాగుతున్న వేళ వారితో మంత్రి ఈటెల  రాజేందర్‌ నేరుగా చర్చలకు దిగారు. వారికి అండగా ప్రభుత్వం ఉందని హావిూ ఇచ్చారు. ఉదయం నుంచి హాస్పిటల్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జూనియర్‌ డాక్టర్లను ఆందోళన విరమించాలని మంత్రి ఈటల  రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు . మాట్లాడేందుకు ప్రతినిధి బృందం సెక్రటేరియట్‌కు రావాలని కోరారు. కానీ మంత్రి విజ్ఞప్తి పై స్పందించ లేదు. తాము సీఎంనే కలుస్తామని తెగేసి చెప్పారు. మంత్రితో చర్చించేందుకు సెక్రటేరియట్‌ కు వెళ్లలేదు. దీంతో స్వయం గా మంత్రి ఈటల  గాంధీ మెడికల్‌ కాలేజ్‌కు వెళ్లారు. 

సెమినార్‌ హాల్‌ లో జూనియర్‌ డాక్టర్లతో సమావేశమయ్యారు. డిసెంబర్‌లో కేంద్రం తీసుకు వచ్చిన జీఓను పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్‌ చేయాలని డిమాండ్‌ చేసారు. గాంధీలోనే కోవిడ్‌ ట్రీట్మెంట్‌ కాకుండా.. ఇతర హాస్పిటల్స్‌ లో కూడా పేషెంట్లను ఉంచాలన్నారు. త్వరలో జరగ బోతున్న పీజీ ఎగ్జామ్స్‌ ను వాయిదా వేయాలని డిమాండ్‌  చేసారు. దాడులు జరిగినప్పుడల్లా చర్చలు  చేస్తున్నా.. ప్రయెజనం ఉండటం లేదని..అందుకే నేరుగా సీఎంతోనే మాట్లాడతామని జూనియర్‌ డాక్టర్లు. చెబుతున్నారు. మొత్తంగా ఈటెల రాజేందర్‌ చర్చలతో వారు సానుకూలంగా స్పందించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు