Ticker

6/recent/ticker-posts

Ad Code

పర్యావరణ పరిరక్షణ మన విధానం కావాలి

ఒక్కో విద్యార్తి ఒక్కో మొక్క నాటాలి: హరీష్‌ రావు

ప్రపంచ పర్యావరణ దినోత్సవము సందర్బంగా మొక్కను నాటుతున్న మంత్రి హరీష్ రావు 

సిద్దిపేట,జూన్‌5(ఇయ్యాల తెలంగాణ):  భూమండలంలో అన్నిటికంటే విలువైనది ప్రకృతి అని..జీవ కోటి మనుగడ ప్రకృతి, పర్యావరణంపై ఆధారపడి ఉందని మంత్రి హరీష్‌ రావు అన్నారు.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు ప్రజలకు సందేశాన్నిఇచ్చారు. మొక్కు లేకపోతే మానవ మనుగడనే ప్రశ్నార్ధకం అవుతుందని హరీశ్‌ రావు అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు  ఎన్నో ప్రకృతి పై దృష్టి  పెడుతున్నాయని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి..వాటిని  సంరక్షించాలని  కోరారు. చెట్లను నాటడం వాటిని సంరక్షించడం ఉద్యమ తరహాలో చేపట్టాలని సూచించారు. ప్రకృతి సంరక్షణ మన అందరి బాధ్యత..130 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశం చెట్లను నాటి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి విూద ఉందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సహజ వనరుల  పరిరక్షణ ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. కాలుష్యం బాగా పెరిగి కొత్త కొత్త వ్యాధులు, క్యాన్సర్‌ లాంటి వ్యాధుల బారిన పడుతున్నామని అన్నారు.కాలుష్యాన్ని నియంత్రించేందుకు..చెట్లను పెంచడం..అడవులను సంరక్షించడం.. ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారించాలన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో  ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కూడా ప్రకృతి, పర్యావరణంపై బోధించాలని ప్రతి ఒక్క విద్యార్థితో మొక్క నాటించాలని పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు సూచించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు