Ticker

6/recent/ticker-posts

Ad Code

తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు రద్దు

ఇంటర్నల్‌ మార్కుల  ఆధారంగా గ్రేడింగ్ లు 


రాష్ట్రం వ్యాప్తంగా  5,34,903 మంది పదో తరగతి విద్యార్థులకు ఊరట

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షలు  అసాధ్యమని భావన

డిగ్రీ, పీజీ పరీక్షల  నిర్వహణపై కూడా త్వరలో నిర్ణయం

ఉన్నతస్థాయిలో సవిూక్షించిన  సిఎం కెసిఆర్‌ 

 హైదరాబాద్‌,జూన్‌8(ఇయ్యాల తెలంగాణ):  తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌  కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు  లేకుండానే టెన్త్‌ విద్యార్థును ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల  మంది విద్యార్థులు  ప్రమోట్‌ అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితి దృష్ట్యా పరీక్షలు  నిర్వహించ కుండానే  ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల  ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే డిగ్రీ, పీజీ పరీక్షల  నిర్వహణపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని  ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు పరీక్షలు  నిర్వహించుకోవచ్చని అనుమతించినా..రంగారెడ్డి, హైదరాబాద్‌లో అనుమతి నిరాకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం  ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు  పాల్గొన్న ఈ సమావేశంలో పరీక్షల  నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. కాగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు  మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలతో పదో తరగతి పరీక్షలు  నిర్వహించేందుకు అనుమతిస్తూ హైకోర్టు శనివారం తీర్పునివ్వగా అలా వేర్వేరుగా పరీక్షల  నిర్వహణ సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం సోమవారం నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే. ఇప్పటికే హరియాణా, పంజాబ్‌ తదితర రాష్ట్రాలు  టెన్త్‌ పరీక్షలు  రద్దు చేసి విద్యార్థుందరినీ ప్రమోట్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు . ఈ మేరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు  రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు  లేకుండానే విద్యార్థులను పై తరగతులకు  ప్రమోట్‌ చేయాలని  నిర్ణయించింది. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల  ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు.కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదో తరగతి పరీక్షలు  నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు  నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు స్జబెక్టులు , 11 పేపర్లుండగా, అందులో రెండు స్జబెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు  పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల  మేరకు ప్రభుత్వం   పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్నిసీఎం నిర్వహించారు. ఈ సమావేశంలో టెన్త్‌  పరీక్షల  విషయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్టాలు  అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. ఈ సమావేశంలో తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు.  గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్‌ అసెస్మెంట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల  ఆధారంగా వచ్చే గ్రేడును పరగణలోకి తీసుకుని పదో తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు