హైదరాబాద్ జులై 7, (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్ పాత బస్తీలో బోనాలు ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజలోని సింహవాహిని మహాంకాళీ అమ్మవారి శిఖర పూజా , ద్వజారోహనం తో పాత బస్తి లో బోనాల సందడి మొదలయింది. శుక్రవారం జరిగిన శిఖర పూజ లో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ వెంకన్న,సౌత్ జూన్ డిసిపి సాయి చేతన్య తదితరులు పాల్గోన్నారు.
ఓల్డ్ సిటీ లో జూలై 16న బోనాలు, జూలై 17 న భవిష్యవాణి ( రంగం ) కార్యక్రమం జరుగుతాయి. సీనీ సివి ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆనవాయితీగా శిఖర పూజలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఓల్డ్ సిటీ బోనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని అన్నారు.