హాకీని జాతీయ క్రీడగా ప్రకటించాలి

పిటిషన్‌పై సుప్రీం కోర్టు నిస్సహాయత


న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8 (ఇయ్యాల తెలంగాణ): హాకీని జాతీయ క్రీడగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌పై తాము ఏవిూ చేయలేమని జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదని.. మనకు జాతీయ జంతువు ఉన్నప్పుడు జాతీయ క్రీడ ఎందుకు ఉండకూడదని పిల్‌ వేసిన న్యాయవాది విశాల్‌ తివారీ ధర్మాసనం ముందు తన వాదన వినిపించారు. అయితే, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని  పిటిషనర్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని లేదంటే తామే రద్దు చేస్తామని జస్టిస్‌ లలిత్‌ వ్యాఖ్యానించారు. దీంతో న్యాయవాది విశాల్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....