సీతారామ PROJECT TRAIL RUN విజయవంతం !

కొత్తగూడెం జూన్‌ 27 (ఇయ్యాల తెలంగాణ ) 2024భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం అయింది. బి.జి కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్‌ ట్రయల్‌ రన్‌ చేసినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంప్‌ హౌస్‌ ను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్‌ జిల్లాలకు నీరందనుంది. వైరా లింక్‌ కెనాల్‌ ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయరుకు నీరు పారుతున్నాయి. ఈ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనుంది. ఖమ్మం జిల్లాలో 4లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాద్‌ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. మరోవైపు నేడు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క , మంత్రులు పొంగులేటి,I(కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, తుమ్మల కొత్తగూడెంలో పర్యటించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....