హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : సఫాయ్ కర్మచారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ సఫాయ్ కార్మికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వేల్పుల కృపాధానం అన్నారు. ఈ నెల 21 వ తేదీన పలువురు కార్మిక నాయకులతో కలసి సంతోష్ నగర్ జిహెచ్ఎంసి సర్కిల్ డిప్యూటి కమీషనర్ శివకుమార్ ని కలసి సఫాయ్ కార్మికుల సమస్యలను, డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేల్పుల కృపాధానం మాట్లాడుతూ గత ప్రభుత్వం సఫాయ్ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని, సమస్యల పరిష్కారాలు సమాయానికి జరగనందువల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమీషనర్ తో తమ ఆవేదనను వ్యక్తపరచినట్లు తెలిపారు. కమీషనర్ శివకుమార్ కూడా నగర కమిషనర్ తో త్వరలోనే కలసి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు కృపాధానం తెలిపారు. అనంతరం కృపాధానం నాయక బృందం కలసి కమీషనర్ శివకుమార్ కి శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాండు షేక్ ఖదీర్ నర్సింగ్ రావ్ ఇబ్రహిం క్రిష్ణా అశోక్ యాదవ్ సురేందర్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సఫాయ్ కర్మచారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : Telangana సఫాయ్ కార్మికుల సంఘం
Leave a Comment