శ్రీశైలం జులై 3, (ఇయ్యాల తెలంగాణ ):గురుపౌర్ణమి పర్వదినాన్ని పుస్కరించుకుని జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి, హెమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తి స్వామికి, వ్యాసమహర్షి కి విశేష పూజలను ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు పూజా సంకల్పాన్ని పఠించి తరువాత మహాగణపతి పూజా చేశారు. అనంతరం దక్షిణామూర్తి మరియు వ్యాసమహర్షి చిత్రపటాలకి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం అర్చకులు, వేదపండితులు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.హరిదాసు పాల్గొన్నారు.
- Homepage
- General News
- శ్రీశైలంలో గురుపౌర్ణమి వేడుకలు
శ్రీశైలంలో గురుపౌర్ణమి వేడుకలు
Leave a Comment