శ్రీశైంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఉపాసన

శ్రీశైం,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ ): దాదాపు 75 రోజుల  తర్వాత శ్రీశైం మల్లన్న  ఆలయం తెరుచుకొని ప్రయోగాత్మకంగా దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. గంటకు 300 మంది చొప్పున భక్తులను స్వామి, అమ్మవార్ల దర్శనానికి పంపుతున్నారు. భక్తులు  తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ ముఖాలకు మాస్క్‌లను ధరిస్తున్నారు. ఆలయం ఆవరణలో కట్టధిట్టమైన చర్యలు  తీసుకోవాలని ఉద్యోగులకు శ్రీశైలం  దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు ఆదేశాలు  జారీచేశారు. మంగళవారం ఉదయం ముఖానికి మాస్క్‌ ధరించి వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ,రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల  స్వామివారిని దర్శించుకొన్నారు. చాలా రోజుల  తర్వాత శ్రీశైం మల్లన్న ను  దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని ఉపాసన ఈ సందర్భంగా తనను కలిసిన విూడియాతో అన్నారు. అనంతరం స్థానిక చెంచులు, ఆలయ ఉద్యోగులు, స్థానిక ప్రజలకు పెద్ద మొత్తంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పోలీసులకు మాస్క్‌లతోపాటు పీపీఈ కిట్లను అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు  ఇంటి పట్టునే ఉంటూ జాగ్రత్తలు  పాటించాలని ఆమె సూచించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....