విజయ్‌ దేవరకొండ డ్యాన్స్‌ అదుర్స్‌ అంటున్న ఛార్మి

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబీనేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ’లైగర్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటి అనన్య పాండే హీరోయిన్‌. కరణ్‌ జోహార్‌, పూరి జగన్నాథ్‌, చార్మీ, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై విజయ్‌ ఫ్యాన్స్‌కి ఉత్తేజకరమైన అప్‌డేట్‌ ఇచ్చింది చార్మీ. ’లైగర్‌’ షూటింగ్‌కి గురించి తాజాగా సోషల్‌ విూడియాలో షేర్‌ చేసింది చార్మీ. ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా పాత్రల్లో కనిపించిన విజయ్‌.. ఇందులో కొత్త అవతారంలో కనిపిస్తాడని ఈ బ్యూటీ తెలిపింది. ఈ సినిమాలో ఓ పాట కోసం ఈ రౌడీ హీరో మునుపెన్నడూ చేయని విధంగా మాస్‌ డ్యాన్స్‌తో ఇరగదీస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఆ పాట చిత్రీకరణలో కుర్ర హీరో ఎనర్జీ చూసి ఈ పోస్ట్‌ పెడుతున్నట్లు పేర్కొంది ఈ భామ. క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....